TS News: జమునా హేచరీస్ ఆక్రమణలో 70.33 ఎకరాలు
మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకులకు చెందిన జమునా హేచరీస్ ఆక్రమణలో 70.33 ఎకరాల ఎసైన్డు, సీలింగ్ భూములున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. మెదక్ జిల్లా మాసాయిపేట
ఇవన్నీ ఎసైన్డు, సీలింగ్ భూములు
మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ వెల్లడి
సివిల్, క్రిమినల్ చర్యలకు సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరీశ్, చిత్రంలో అదనపు కలెక్టర్ రమేశ్, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్
ఈనాడు, న్యూస్టుడే, మెదక్: మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబీకులకు చెందిన జమునా హేచరీస్ ఆక్రమణలో 70.33 ఎకరాల ఎసైన్డు, సీలింగ్ భూములున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో పేదలకు కేటాయించిన ఈ భూములను కబ్జా చేశారని నిర్ధారించారు. దీంతో పాటు వివిధ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిపారు. క్రిమినల్, సివిల్ చర్యలకు సిఫార్సు చేస్తూ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు. ఈటల తమ భూములను ఆక్రమించుకున్నారని 8 మంది రైతులు ఈ ఏడాది ఏప్రిల్లో సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు మే 1న సర్వే నిర్వహించి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే చేస్తున్నారని, ఇతర కారణాలతో జమునా హేచరీస్ ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లగా.. అప్పట్లో పూర్తిస్థాయిలో సర్వే జరగలేదు. తాజాగా కలెక్టర్ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చి గత నెల 16న మళ్లీ సర్వే పనులు ప్రారంభించి వారంలో పూర్తి చేశారు. అనంతరం నివేదిక సిద్ధం చేశారు.
అచ్చంపేటలోని సర్వే సంఖ్య 77లో జమునా హేచరీస్కు వెళ్లేందుకు వేసిన దారిలో సీలింగ్ భూమిగా గుర్తించి ఏర్పాటు చేసిన హద్దురాయి
కలెక్టర్ తెలిపిన వివరాలివీ..
* హకీంపేటలో సర్వే సంఖ్య 97, అచ్చంపేటలో 77, 78, 79, 80, 81, 82, 130 సర్వే సంఖ్యల్లో కలిపి 70.33 ఎకరాలను దౌర్జన్యంగా ఆక్రమించారు. ఇందులో 61.13 ఎకరాలు ఎసైన్డ్ భూమి. 9.19 ఎకరాలు సీలింగ్ (ప్రభుత్వ) భూమి. 49 మంది బీసీలు, నలుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఒక ఓసీకి చెందిన భూములివి. వాటిని స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. ఆక్రమించిన వారు ఎసైన్డు భూముల (బదిలీ నిషేధం) చట్టం ప్రకారం శిక్షార్హులు.
* సర్వే సంఖ్య 81లో అయిదెకరాలు, సర్వే సంఖ్య 130లో మూడెకరాలు జమునా హేచరీస్ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. 2010 నుంచి నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు గమనించాం. చట్టం ప్రకారం సేల్డీడ్లను రద్దు చేయాలి. వ్యవసాయేతర అవసరాలకు వాడుకునేందుకు.. నమోదు చేసుకోకుండా భారీగా షెడ్ల నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి సబ్రిజిస్ట్రార్, తహసీల్దార్లపై విచారణ చేపట్టాలి.
* హేచరీస్ నుంచి వచ్చే వ్యర్థాలను సర్వే సంఖ్య 97లో పోస్తున్నట్లు తేలింది. దీంతో హల్దీవాగుకు అనుసంధానంగా ఉన్న ఎల్క చెరువు నీరు కలుషితమవుతోంది. భూగర్భజలాలతో పాటు వాయు కాలుష్యం నెలకొంటోంది. దీనిపై సమీప గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేశారు. పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
* స్థానిక పంచాయతీల నుంచి అనుమతులు తీసుకోకుండానే హకీంపేట సర్వే సంఖ్య 111లో ఫౌల్ట్రీ ఫీడ్ నిల్వకు గాదెలు నిర్మించారు. అచ్చంపేట సర్వే సంఖ్య 130లో షెడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై పంచాయతీ నుంచి తాఖీదులు జారీ అయ్యాయి. వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకోకుండానే నిర్మాణాలు చేపట్టడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది.
* సర్వే నం 130తో పాటు ఇతర సర్వే సంఖ్యల్లోని ఎసైన్డు భూములను జమునా హేచరీస్కు విక్రయానికి తెల్ల కాగితాలపై రాసుకున్న ఒప్పంద ప్రతులు లభ్యమయ్యాయి.
* ఈ రెండు గ్రామాల పరిధిలో మొత్తం 579 ఎకరాలు పేదలకు పంపిణీ చేశారు. ప్రస్తుతం సర్వే నిర్వహించిన భూముల్లో కాకుండా మరో 300 ఎకరాలకు సంబంధించి సర్వే చేయాలని దాదాపు 30 మంది వినతులు ఇచ్చారు. తమ భూముల్లోకి వెళ్లేందుకు అవకాశం లేకుండా ఆక్రమణలు జరిగాయని వారు చెబుతున్నారు. వాస్తవాలను గుర్తించేందుకు త్వరలో సర్వే చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.