Omicron: ఒమిక్రాన్ కొమ్ము వంచే టీకా సులువేనా!
ప్రస్తుత కొవిడ్-19 టీకాలు ఒమిక్రాన్ వేరియంట్పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనే అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన వ్యాక్సిన్లు తీవ్రస్థాయి అనారోగ్యం నుంచి రక్షిస్తాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అయితే కొత్త
కొత్త వేరియంట్పై పోరుకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో మార్పు
వంద రోజులు చాలంటున్న నిపుణులు
ప్రస్తుత కొవిడ్-19 టీకాలు ఒమిక్రాన్ వేరియంట్పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనే అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన వ్యాక్సిన్లు తీవ్రస్థాయి అనారోగ్యం నుంచి రక్షిస్తాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అయితే కొత్త వేరియంట్కు అనుగుణంగా ఎంఆర్ఎన్ఏ టీకాల్లో మార్పు చేసే అంశాన్ని ఫైజర్, మోడెర్నా వంటి సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఈ ప్రక్రియ అంత సులువుగా సాగుతుందా అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఈ ప్రక్రియపై పరిశోధకుల విశ్లేషణ ఇది.
టీకాలను ఎందుకు మెరుగుపరచాలి?
ఇప్పటికే ఇచ్చిన టీకాతో ఉత్పత్తయిన యాంటీబాడీలు.. కొత్త వేరియంట్ను గుర్తించి, దాన్ని నిర్వీర్యం చేయలేని స్థితి ఉంటుందా
అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
* కరోనా వైరస్ తన కొమ్ము ప్రొటీన్ను (స్పైక్) ఉపయోగించుకొని మానవ కణాల్లోని ఏసీఈ2 గ్రాహకాల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.
* కొవిడ్ నివారణకు రూపొందిన ఎంఆర్ఎన్ఏ టీకాలన్నీ స్పైక్ ప్రొటీన్ను ఉత్పత్తి చేయాలన్న సందేశాన్ని మానవ కణాలకు అందిస్తాయి.
* ఇలా తయారయ్యే స్పైక్ ప్రొటీన్ యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది.
* ఆ యాంటీబాడీలు కరోనాలోని స్పైక్ ప్రొటీన్కు అంటుకొని వైరస్ను అడ్డుకుంటాయి.
* ఒమిక్రాన్లోని స్పైక్ ప్రొటీన్ ఉత్పరివర్తనాల్లో కొత్త పోకడ కనిపించింది. మునుపటి టీకాలతో ఉత్పత్తయిన యాంటీబాడీల్లో కొన్నింటి సామర్థ్యాన్ని అవి తగ్గించేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ను మెరుగుపరచాల్సి రావొచ్చు.
కొత్త వ్యాక్సిన్ ఎంత భిన్నంగా ఉంటుంది?
ప్రస్తుత ఎంఆర్ఎన్ఏ టీకాల్లో కరోనా వైరస్లో మొదట వచ్చిన వేరియంట్కు సంబంధించిన స్పైక్ ప్రొటీన్ సంకేతం ఉంది. కొత్తగా రూపొందించే వ్యాక్సిన్లో ఒమిక్రాన్ సంకేతాన్ని ఉంచుతారు. ఫలితంగా ఈ కొత్త టీకా ఒమిక్రాన్ వైరస్కు బలంగా అంటుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేయిస్తుంది.
* ఇప్పటికే టీకా పొందిన వారు లేదా గతంలో కొవిడ్ నుంచి కోలుకున్నవారు ఈ కొత్త టీకాతో కూడిన బూస్టర్ డోసును పొందాల్సి ఉంటుంది. తద్వారా వీరు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న ఇతర వేరియంట్లతో పాటు ఒమిక్రాన్ను కూడా సమర్థంగా ఎదుర్కోగలరు.
* ఒకవేళ డెల్టా వేరియంట్ను తోసిరాజని ఒమిక్రాన్ ప్రధాన రకంగా మారిపోతే.. ఇప్పటికీ టీకా పొందనివారు 2-3 డోసుల కొత్త వ్యాక్సిన్ను పొందితే సరిపోతుంది.
* డెల్టా, ఒమిక్రాన్లు రెండూ విస్తృతంగా వ్యాప్తిలో ఉంటే.. ప్రస్తుత, మెరుగుపరచిన టీకాలతో కూడిన మిశ్రమాన్ని పొందాల్సి రావొచ్చు.
టీకాను మెరుగుపరిచేదెలా?
ఎంఆర్ఎన్ఏ టీకాను మెరుగుపరచడానికి కొత్త వేరియంట్కు సంబంధించిన స్పైక్ ప్రొటీన్ జన్యుక్రమం, ఎంఆర్ఎన్ఏ నిర్మాణానికి ఉపయోగించే డీఎన్ఏ టెంప్లేట్ అవసరం. ఒమిక్రాన్లోని స్పైక్ ప్రొటీన్కు సంబంధించిన జన్యు సంకేతాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికే వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడు మిగిలిందల్లా.. స్పైక్ ప్రొటీన్కు సంబంధించిన డీఎన్ఏ టెంప్లేట్ను తయారుచేయడమే. దాని సాయంతోనే కొత్త వ్యాక్సిన్లలోని ఎంఆర్ఎన్ఏ భాగాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు డీఎన్ఏ టెంప్లేట్లను కృత్రిమ ఎంజైమ్లు, ఎంఆర్ఎన్ఏలోని నాలుగు నిర్మాణ ‘ఇటుక’లైన జి, ఎ, యు, సిలతో కలుపుతారు. ఫలితంగా డీఎన్ఏ టెంప్లేట్కు సంబంధించిన ఎంఆర్ఎన్ఏ ప్రతులు సిద్ధమవుతాయి. ఈ విధానంలో ఒక బ్యాచ్ ఎంఆర్ఎన్ఏను ఉత్పత్తి చేయడానికి కొన్ని నిమిషాలు సరిపోతాయి. ఆ తర్వాత ఈ ఎంఆర్ఎన్ఏ ప్రతులను ఫ్యాటీ నానోరేణువుల్లో ఉంచుతారు.
ఎంత సమయం పడుతుంది?
డీఎన్ఏ టెంప్లేట్ సృష్టికి 3 రోజులు సరిపోతుంది. ల్యాబ్లో పరీక్షించడానికి సరిపడా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయడానికి వారం పడుతుంది. ఆ తర్వాత టెస్ట్ ట్యూబుల్లో మానవ కణాలపై పరీక్షించడానికి మరో ఆరువారాలు అవసరం. మనుషులపై క్లినికల్ ప్రయోగాలు చేయడానికి మరికొన్ని వారాలు అవసరం. అంతిమంగా కొత్త వ్యాక్సిన్ను అప్డేట్ చేసి, అన్ని పరీక్షలు పూర్తిచేయటానికి దాదాపు 100 రోజులు పడుతుంది. ఈ ప్రయోగాలు జరుగుతుండగానే ఉత్పత్తిదారులు తమ తయారీ ప్రక్రియల్లో మార్పులు చేసుకుంటే.. కొత్త టీకాకు ఆమోదం లభించగానే దాన్ని వేగంగా అందుబాటులోకి తీసుకురావొచ్చు.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?