Omicron: ఒమిక్రాన్ కొమ్ము వంచే టీకా సులువేనా!
ప్రస్తుత కొవిడ్-19 టీకాలు ఒమిక్రాన్ వేరియంట్పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనే అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన వ్యాక్సిన్లు తీవ్రస్థాయి అనారోగ్యం నుంచి రక్షిస్తాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అయితే కొత్త
కొత్త వేరియంట్పై పోరుకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో మార్పు
వంద రోజులు చాలంటున్న నిపుణులు
ప్రస్తుత కొవిడ్-19 టీకాలు ఒమిక్రాన్ వేరియంట్పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనే అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన వ్యాక్సిన్లు తీవ్రస్థాయి అనారోగ్యం నుంచి రక్షిస్తాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అయితే కొత్త వేరియంట్కు అనుగుణంగా ఎంఆర్ఎన్ఏ టీకాల్లో మార్పు చేసే అంశాన్ని ఫైజర్, మోడెర్నా వంటి సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఈ ప్రక్రియ అంత సులువుగా సాగుతుందా అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఈ ప్రక్రియపై పరిశోధకుల విశ్లేషణ ఇది.
టీకాలను ఎందుకు మెరుగుపరచాలి?
ఇప్పటికే ఇచ్చిన టీకాతో ఉత్పత్తయిన యాంటీబాడీలు.. కొత్త వేరియంట్ను గుర్తించి, దాన్ని నిర్వీర్యం చేయలేని స్థితి ఉంటుందా
అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
* కరోనా వైరస్ తన కొమ్ము ప్రొటీన్ను (స్పైక్) ఉపయోగించుకొని మానవ కణాల్లోని ఏసీఈ2 గ్రాహకాల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.
* కొవిడ్ నివారణకు రూపొందిన ఎంఆర్ఎన్ఏ టీకాలన్నీ స్పైక్ ప్రొటీన్ను ఉత్పత్తి చేయాలన్న సందేశాన్ని మానవ కణాలకు అందిస్తాయి.
* ఇలా తయారయ్యే స్పైక్ ప్రొటీన్ యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది.
* ఆ యాంటీబాడీలు కరోనాలోని స్పైక్ ప్రొటీన్కు అంటుకొని వైరస్ను అడ్డుకుంటాయి.
* ఒమిక్రాన్లోని స్పైక్ ప్రొటీన్ ఉత్పరివర్తనాల్లో కొత్త పోకడ కనిపించింది. మునుపటి టీకాలతో ఉత్పత్తయిన యాంటీబాడీల్లో కొన్నింటి సామర్థ్యాన్ని అవి తగ్గించేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ను మెరుగుపరచాల్సి రావొచ్చు.
కొత్త వ్యాక్సిన్ ఎంత భిన్నంగా ఉంటుంది?
ప్రస్తుత ఎంఆర్ఎన్ఏ టీకాల్లో కరోనా వైరస్లో మొదట వచ్చిన వేరియంట్కు సంబంధించిన స్పైక్ ప్రొటీన్ సంకేతం ఉంది. కొత్తగా రూపొందించే వ్యాక్సిన్లో ఒమిక్రాన్ సంకేతాన్ని ఉంచుతారు. ఫలితంగా ఈ కొత్త టీకా ఒమిక్రాన్ వైరస్కు బలంగా అంటుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేయిస్తుంది.
* ఇప్పటికే టీకా పొందిన వారు లేదా గతంలో కొవిడ్ నుంచి కోలుకున్నవారు ఈ కొత్త టీకాతో కూడిన బూస్టర్ డోసును పొందాల్సి ఉంటుంది. తద్వారా వీరు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న ఇతర వేరియంట్లతో పాటు ఒమిక్రాన్ను కూడా సమర్థంగా ఎదుర్కోగలరు.
* ఒకవేళ డెల్టా వేరియంట్ను తోసిరాజని ఒమిక్రాన్ ప్రధాన రకంగా మారిపోతే.. ఇప్పటికీ టీకా పొందనివారు 2-3 డోసుల కొత్త వ్యాక్సిన్ను పొందితే సరిపోతుంది.
* డెల్టా, ఒమిక్రాన్లు రెండూ విస్తృతంగా వ్యాప్తిలో ఉంటే.. ప్రస్తుత, మెరుగుపరచిన టీకాలతో కూడిన మిశ్రమాన్ని పొందాల్సి రావొచ్చు.
టీకాను మెరుగుపరిచేదెలా?
ఎంఆర్ఎన్ఏ టీకాను మెరుగుపరచడానికి కొత్త వేరియంట్కు సంబంధించిన స్పైక్ ప్రొటీన్ జన్యుక్రమం, ఎంఆర్ఎన్ఏ నిర్మాణానికి ఉపయోగించే డీఎన్ఏ టెంప్లేట్ అవసరం. ఒమిక్రాన్లోని స్పైక్ ప్రొటీన్కు సంబంధించిన జన్యు సంకేతాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికే వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడు మిగిలిందల్లా.. స్పైక్ ప్రొటీన్కు సంబంధించిన డీఎన్ఏ టెంప్లేట్ను తయారుచేయడమే. దాని సాయంతోనే కొత్త వ్యాక్సిన్లలోని ఎంఆర్ఎన్ఏ భాగాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు డీఎన్ఏ టెంప్లేట్లను కృత్రిమ ఎంజైమ్లు, ఎంఆర్ఎన్ఏలోని నాలుగు నిర్మాణ ‘ఇటుక’లైన జి, ఎ, యు, సిలతో కలుపుతారు. ఫలితంగా డీఎన్ఏ టెంప్లేట్కు సంబంధించిన ఎంఆర్ఎన్ఏ ప్రతులు సిద్ధమవుతాయి. ఈ విధానంలో ఒక బ్యాచ్ ఎంఆర్ఎన్ఏను ఉత్పత్తి చేయడానికి కొన్ని నిమిషాలు సరిపోతాయి. ఆ తర్వాత ఈ ఎంఆర్ఎన్ఏ ప్రతులను ఫ్యాటీ నానోరేణువుల్లో ఉంచుతారు.
ఎంత సమయం పడుతుంది?
డీఎన్ఏ టెంప్లేట్ సృష్టికి 3 రోజులు సరిపోతుంది. ల్యాబ్లో పరీక్షించడానికి సరిపడా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయడానికి వారం పడుతుంది. ఆ తర్వాత టెస్ట్ ట్యూబుల్లో మానవ కణాలపై పరీక్షించడానికి మరో ఆరువారాలు అవసరం. మనుషులపై క్లినికల్ ప్రయోగాలు చేయడానికి మరికొన్ని వారాలు అవసరం. అంతిమంగా కొత్త వ్యాక్సిన్ను అప్డేట్ చేసి, అన్ని పరీక్షలు పూర్తిచేయటానికి దాదాపు 100 రోజులు పడుతుంది. ఈ ప్రయోగాలు జరుగుతుండగానే ఉత్పత్తిదారులు తమ తయారీ ప్రక్రియల్లో మార్పులు చేసుకుంటే.. కొత్త టీకాకు ఆమోదం లభించగానే దాన్ని వేగంగా అందుబాటులోకి తీసుకురావొచ్చు.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
నూతన నేర న్యాయ చట్టాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్