Omicron: 20 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ గురించి తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూడటానికి ముందే... గత అక్టోబరులోనే ఈ కొత్త వేరియంట్ పలు దేశాలకు వ్యాపించినట్టు స్పష్టమవుతోంది.
దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో నమోదు
యూరోపియన్ దేశాల్లో 44కు చేరిన కొత్త వేరియంట్ బాధితులు
టోక్యో: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ గురించి తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూడటానికి ముందే... గత అక్టోబరులోనే ఈ కొత్త వేరియంట్ పలు దేశాలకు వ్యాపించినట్టు స్పష్టమవుతోంది. అయితే, దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? టీకా వల్ల కలిగే రోగనిరోధక శక్తిని ఇది తప్పించుకుంటుందా? అన్న కీలక విషయాల్లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పలు ఐరోపా దేశాల్లో డెల్టా కారణంగా పెద్దసంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్న క్రమంలోనే, ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ కారణంగా యూరోపియన్ యూనియన్లోని 11 దేశాల్లో ఇప్పటివరకూ 44 కేసులు నమోదయ్యాయి! వీరిలో చాలామంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారేనని తేలింది. తాజాగా మరిన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ వేరియంట్ వ్యాపించిన దేశాల సంఖ్య 20కు చేరింది.
అక్టోబరు ప్రారంభంలోనే తొలికేసు?
నైజీరియాలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. అక్టోబరులో సేకరించిన నమూనాలను పరీక్షించగా కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్టు ఆ దేశ జాతీయ ప్రజాఆరోగ్య సంస్థ బుధవారం వెల్లడించింది. కొత్త వేరియంట్ గురించి దక్షిణాఫ్రికా అప్రమత్తం చేయడానికి కొన్నివారాల ముందే అక్కడి నుంచి వచ్చినవారి నుంచి ఈ నమూనాలను సేకరించినట్టు తెలిపింది. ఆఫ్రికా నుంచి ఇటీవల సౌదీ అరేబియా వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది.
అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు
డిసెంబరు చివరి వరకూ కొత్త రిజర్వేషన్లను తీసుకోవద్దని అంతర్జాతీయ ఎయిర్స్ లైన్స్ సంస్థలను జపాన్ ఆదేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనందున, అత్యవసర చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నవంబరు 22 నుంచి దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్డౌన్ను ఆస్ట్రియా సర్కారు ఈనెల 11 వరకూ పొడిగించింది. అత్యవసర వస్తువుల దుకాణాలను ఇకపై సాయంత్రం 7 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. క్రిస్మస్ ట్రీ అమ్మకాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఒమిక్రాన్పై చర్చించేందుకు అత్యవసరంగా బ్లాక్ లీడర్స్ స్థాయి సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదనను యురోపియన్ యూనియన్ నిరాకరించింది. డిసెంబర్ 16న నేతల సమావేశానికి ముందు... 27 దేశాల ఆరోగ్యశాఖ మంత్రులు ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తారని ఈయూ అధికారి తెలిపారు. ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రియా, దక్షిణ కొరియాల్లో డెల్టా కారక కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి.
విదేశాల నుంచి రాక.. ఆరుగురికి పాజిటివ్!
దిల్లీ: దక్షిణాఫ్రికా తదితర ఎట్-రిస్క్ దేశాల నుంచి 3,476 మంది ప్రయాణికులు బుధవారం భారత్ వచ్చారు. వీరికి పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ నిమిత్తం ప్రయోగశాలకు పంపారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ వివరాలు తెలిపింది. వీరిలో నెదర్లాండ్స్, బ్రిటన్ నుంచి వచ్చినవారు నలుగురు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆరుగురిని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాతో పాటు బ్రిటన్, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్లను కేంద్రం ఎట్-రిస్క్ దేశాలుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా