సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో కేసు

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై ట్విటర్‌ వేదిక అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీనటుడు సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది.

Published : 13 Jan 2022 05:11 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై ట్విటర్‌ వేదిక అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీనటుడు సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఆయన ట్వీట్‌ మహిళలను కించపరిచేలా, అవమానపరిచేలా ఉందని నగరానికి చెందిన సామాజికవేత్త, పరిశోధకురాలు ప్రేరణ  ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయ సలహా తీసుకొని సిద్ధార్థ్‌పై సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని