గిరిజనేతరుల చేతుల్లో 1.52 లక్షల ఎకరాల అటవీ భూమి
అడవితో సంబంధం లేని గిరిజనేతరులు అటవీ భూముల్ని పెద్ద మొత్తంలో ఆక్రమించుకున్నారు. సాగు పేరుతో కొందరు, భూముల విలువ పెరుగుతుండటంతో మరికొందరు ఆ భూముల్ని తమ అధీనంలో..
ఆక్రమణదారులు 46,871 మంది..
6 జిల్లాల్లోనే లక్ష ఎకరాల మేర అటవీ భూమి కబ్జా
ఈనాడు, హైదరాబాద్: అడవితో సంబంధం లేని గిరిజనేతరులు అటవీ భూముల్ని పెద్ద మొత్తంలో ఆక్రమించుకున్నారు. సాగు పేరుతో కొందరు, భూముల విలువ పెరుగుతుండటంతో మరికొందరు ఆ భూముల్ని తమ అధీనంలో ఉంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,871 మంది గిరిజనేతరులు 1.52 లక్షల ఎకరాల అటవీ భూమిని గుప్పెట్లో పెట్టుకున్నట్లు ఆ శాఖ గుర్తించింది. సగటున వీరిలో ఒక్కొక్కరి చేతిలో 3.24 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు తేల్చింది.
1425 గ్రామాల్లో..
అటవీ భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1425 గ్రామాల్లో ఆక్రమణలు జరిగినట్లు జిల్లాలవారీగా ఆ శాఖ క్రోడీకరించింది. ఇందులో అత్యధికం ఆసిఫాబాద్ (169), కొత్తగూడెం (131), ఆదిలాబాద్ (126) జిల్లాల్లో ఉన్నాయి. ఆక్రమణలకు గురైన అటవీ భూముల్లో దాదాపు లక్ష ఎకరాలు ఆరు జిల్లాల్లోనే ఉండడం గమనార్హం. కొన్నిచోట్ల అధికారులు ప్రయోగాత్మకంగా స్వాధీనం చేసుకుని చుట్టూ కందకాలు తవ్వారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రలోభాలకు తలొగ్గడం తదితర కారణాలతోనే ఈ స్థాయిలో ఆక్రమణదారులు పాగా వేయగలిగారనే విమర్శలు ఉన్నాయి.
పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో..
అటవీ ఆక్రమణల్ని అరికట్టే విషయంపై అటవీశాఖ ఇటీవల చర్చించింది. పోలీసు, రెవెన్యూ శాఖల సహకారం తీసుకోవాలని, అటవీ భూముల చుట్టూ కందకాల తవ్వకం వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఆక్రమణలను నిరూపించడానికి నూతన సాంకేతికత పరిజ్ఞానాల్ని వినియోగించేందుకు సిద్ధమవుతోంది.
జిల్లాల వారీగా గిరిజనేతరుల ఆక్రమణలు
ఆసిఫాబాద్ 32,132.20 ఎకరాలు, మహబూబాబాద్ 18,423.36, ములుగు 15,393.81, కొత్తగూడెం 11,229.98, కామారెడ్డి 10,632.34, భూపాలపల్లి 10,538.94, ఆదిలాబాద్ 7,895.81, ఖమ్మం 7,168.95, పెద్దపల్లి 4,713.34, జగిత్యాల 3,992.08, మెదక్ 3,435.45, నిజామాబాద్ 3,482.18, నాగర్కర్నూల్ 3,247.14, నల్గొండ 2,479.58, మంచిర్యాల 2,424.23, నిర్మల్ 2,023.73, సిద్దిపేట 2,279.23, వనపర్తి 2,130.62, సిరిసిల్ల 1,933.03, మహబూబ్నగర్ 1,932.80, సంగారెడ్డి 1,763.15, వికారాబాద్ 965.43, వరంగల్ రూరల్ 609.59, భువనగిరి 548.28, రంగారెడ్డి 461.90, సూర్యాపేట 168.93, మేడ్చల్మల్కాజిగిరి 104.90, నారాయణపేట 101.65, గద్వాలలో 12.00 ఎకరాలు గిరిజనేతరుల ఆక్రమణల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వరంగల్ అర్బన్, హైదరాబాద్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో ఈ సంఖ్య సున్నాగా ఉంది. పోడు వ్యవసాయం చేసుకుంటున్న స్థానిక గిరిజనుల (1,47,664 మంది) అధీనంలో 5,56,430.14 ఎకరాలు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గుత్తికోయల (4008 మంది) కబ్జాలో 19,768.14 ఎకరాలు కలిపి మొత్తంగా 7.28 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణల్లో ఉన్నట్లు అటవీశాఖ చెబుతోంది. పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఆ ప్రక్రియలో ఎలాంటి కదలిక లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు