సచివాలయ నిర్మాణ పనుల ఆకస్మిక తనిఖీ

గడువులోగా సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయ నిర్మాణ పనులను

Published : 13 Aug 2022 05:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: గడువులోగా సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగారు. అన్ని అంతస్తులను పరిశీలించారు. గడువు, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. మంత్రి వెంట అధికారులు సత్యనారాయణ, శశిధర్‌, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని