ఐఐటీలకు అపూర్వ అండదండలు
విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో ఐఐటీలు సైతం పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలను (ఎండోమెంట్ నిధిని)సమకూర్చుకునే పనిలో పడ్డాయి. దశాబ్దాల క్రితం చదువు పూర్తి చేసుకొని వివిధ కంపెనీల్లో పెద్ద స్థాయిలో ఉన్న ఒక్కో
పూర్వ విద్యార్థుల నుంచి వెల్లువెత్తుతున్న నిధులు
దృష్టి పెట్టని రాష్ట్ర వర్సిటీలు
ఈనాడు, హైదరాబాద్: విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో ఐఐటీలు సైతం పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలను (ఎండోమెంట్ నిధిని)సమకూర్చుకునే పనిలో పడ్డాయి. దశాబ్దాల క్రితం చదువు పూర్తి చేసుకొని వివిధ కంపెనీల్లో పెద్ద స్థాయిలో ఉన్న ఒక్కో పూర్వ విద్యార్థి రూ.కోట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం వద్ద 42 బిలియన్ డాలర్లు (రూ.3,36,000 కోట్లు), యేల్ విశ్వవిద్యాలయం వద్ద 31 బిలియన్ డాలర్ల (రూ.2.48 లక్షల కోట్లు) ఎండోమెంట్ నిధి ఉంది. అదే బాటలో మన ఐఐటీలు గత రెండు మూడేళ్లుగా కృషి చేస్తున్నాయి.
ఓయూ ఇంజినీరింగ్ కాలేజి ఒక్కటే చురుగ్గా...
రాష్ట్రంలోని వర్సిటీలు పూర్వ విద్యార్థులను ఒక తాటిపైకి తీసుకురావడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం మాత్రం కొంత క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఇటీవల మైనింగ్ ఇంజినీరింగ్ విభాగం నూతన భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థి రూ.80 లక్షల విరాళాన్ని ప్రకటించారని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య శ్రీరాం వెంకటేష్ తెలిపారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాన్ని ప్రారంభించి వచ్చే ఏడాదికి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా దానికి కూడా నూతన భవనాన్ని నిర్మించేందుకు ఆ విభాగం పూర్వ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల సంఘాన్ని ఏర్పాటు చేసినా విరాళాలు నామమాత్రమే.
ఒక తాటిపైకి తెస్తున్నాం
ఆచార్య బీఎస్ మూర్తి, సంచాలకుడు, ఐఐటీహెచ్
గత మూడేళ్ల నుంచి పూర్వ విద్యార్థులను ఒక తాటిపైకి తెస్తున్నాం.వచ్చే డిసెంబరులో అలుమ్నీ డేను జరపబోతున్నాం. మా ఐఐటీ నుంచి తొలి బ్యాచ్ 2012లో బయటకు వెళ్లింది. అంటే ఈ ఏడాదికి వారి చదువు పూర్తయి పదేళ్లు అవుతోంది. అందుకే వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. పరిశోధనలకు, మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని అడుగుతాం. రూ.5 లక్షలు ఇస్తే దానిపై వచ్చే బ్యాంకు వడ్డీతో ఒక విద్యార్థికి పురస్కారం ఇచ్చే విధానాన్ని రూపొందిస్తున్నాం. పూర్వ విద్యార్థులు తాము పనిచేసే కంపెనీలను ఒప్పించి ఐఐటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను స్థాపించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.
ఉదారంగా విరాళాలు
* ఐఐటీ-బాంబేకు 2018-19 నుంచి 2020-21 వరకు పూర్వ విద్యార్థుల నుంచి రూ.109 కోట్ల విరాళాలు వచ్చాయి. వార్షికోత్సవం సందర్భంగా 3,300 మంది దాతల నుంచి రూ.350 కోట్ల విరాళాలు పోగయ్యాయి.
* రూ.వెయ్యి కోట్ల ఎండోమెంట్ నిధిని సేకరించాలని ఐఐటీ దిల్లీ లక్ష్యంగా పెట్టుకుంది. గత అక్టోబరులో అప్పటి రాష్ట్రపతి కోవింద్ ఐఐటీ-దిల్లీ ఎండోమెంట్ ఫండ్ను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా రూ.250 కోట్లు ఇస్తామని పలువురు పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థి అనంత్ యార్ది స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నెలకొల్పేందుకు రూ.75 కోట్ల విరాళం ఇచ్చారు. మరో పాత విద్యార్థి వివేక్ వైద్య రూ.10 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే రూ.2.25 కోట్లు అందజేశారు.
* ఐఐటీ-కాన్పూర్లోని స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేష్ గాంగ్వాల్ రూ.100 కోట్ల విరాళం అందించారు.
* మూడు నెలల క్రితమే ఐఐటీ-గాంధీనగర్కు 2,749 పూర్వ విద్యార్థుల్లో సగం మంది రూ.50 లక్షలను సేకరించి ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.