Munugode Bypoll: కారు.. కమలం.. హస్తం.. ఎవరికో ‘ఉప’యోగం
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు ఆదివారంతో తెర పడనుంది.
నేడు తేలనున్న మునుగోడు ఫలితం
మూడంచెల భద్రత నడుమ లెక్కింపు
విజయంపై ప్రధాన పార్టీల్లో ధీమా
ఈనాడు, నల్గొండ, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు ఆదివారంతో తెర పడనుంది. ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని ప్రధాన పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క నల్గొండ పట్టణం ఆర్జాలబావిలోని గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
‘ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశాం. ఓట్ల లెక్కింపు హాలులో కేంద్ర బలగాలు భద్రత నిర్వహిస్తాయి. మిగిలిన రెండంచెల్లో రాష్ట్ర పోలీసులుంటారు’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. నియోజకవర్గంలో 80 సంవత్సరాలు దాటిన 686 మంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారన్నారు. ఎలక్ట్రానిక్ విధానంలో సర్వీసు ఓట్ల(ఆర్మీకి చెందినవారి)ను ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు అనుమతిస్తామని.. వాటినీ లెక్కిస్తామన్నారు. శనివారం నిర్వహించిన మాక్ కౌంటింగ్ విజయవంతమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వినయ్కృష్ణారెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు. లెక్కింపు కేంద్రం వద్ద 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. మూడు కంపెనీల కేంద్ర బలగాలు కూడా భద్రతా విధుల్లో పాల్గొంటాయన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమవనున్న లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను గణిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు రెండు టేబుళ్లు.. ఈవీఎంల లెక్కింపునకు మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 15 రౌండ్లలో (14 పూర్తిగా, 15వ రౌండ్లో నాలుగు టేబుళ్లు) లెక్కించనున్నారు. అనంతరం డ్రా పద్ధతిన అయిదు పోలింగ్ బూత్లకు సంబంధించిన ఈవీఎంలలోని వీవీస్లిప్లను లెక్కించి సరిచూస్తారు. మధ్యాహ్నం 3 గంటలలోపు తుది ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు వెల్లడించారు. రౌండ్ల వారీగా ఫలితాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు.
ఎవరి లెక్కల్లో వారు..
పోలింగ్ అనంతరం గ్రామాలు, మండలాల వారీగా సమీక్షలు చేసిన అభ్యర్థులు, పార్టీ నాయకులు తమకే అవకాశముంటుందని నమ్ముతున్నారు. సర్వేల ఆధారంగా తెరాస విజయంపై ధీమాతో ఉంది. పోలింగ్ సరళిపై ఇప్పటికే బూత్ల వారీగా ఉన్న ఏజెంట్లతో వివరాలు తెప్పించుకొని అంశాలన్నింటినీ పార్టీ క్రోడీకరించింది. ఎంపీటీసీ పరిధిలో ఇన్ఛార్జులను నియమించడంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ శాతం తదితర అంశాలను సమీక్షించింది. మరోవైపు మధ్యాహ్నం అనంతరం పెరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి తమకు కచ్చితంగా అవకాశముంటుందని భాజపా ఆశాభావంతో ఉంది. చండూరు, చౌటుప్పల్ పురపాలికలతో పాటూ మండల కేంద్రాల్లో తమకు అనుకున్నదానికేంటూ ఎక్కువ ఓట్లు పడ్డాయని పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. మహిళలు, సైలెంట్ ఓటింగ్ తమకు విజయం చేకూరుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు నమ్ముతున్నాయి. వివిధ వర్గాల్లో పార్టీ అభ్యర్థిపై ఉన్న సానుభూతి కలిసొస్తుందని పార్టీ నాయకులు నమ్ముతున్నారు. మరోవైపు బీఎస్పీ, రోడ్రోలర్ గుర్తుల అభ్యర్థులు సైతం తాము ప్రభావం చూపుతామని చెబుతున్నారు. అభ్యర్థులు విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాపంగా ఏడు చోట్ల..
రాష్ట్రంలోని మునుగోడుతో సహా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఆధమ్పుర్(హరియాణా), మొకామా, గోపాల్గంజ్(బిహార్), తూర్పు అంధేరి(మహారాష్ట్ర), గోలాగోకర్న్నాథ్(ఉత్తర్ప్రదేశ్), ధామ్నగర్(ఒడిశా)లలో ఎవరు గెలిచారో తేలనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు