Revanth Reddy: నలుమూలలకూ మెట్రో
హైదరాబాద్ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలందించేలా మెట్రోరైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెట్రోరైలు ఎండీని ఆదేశించారు.
తక్కువ వ్యయంతో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలన్నింటికీ విస్తరణ
గత ప్రభుత్వం ప్రతిపాదించిన ‘రాయదుర్గం-విమానాశ్రయ’ మార్గ నిర్మాణం నిలిపివేత
సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి
కొత్త ప్రతిపాదనలకు ఆమోదం
డీపీఆర్, ట్రాఫిక్ అధ్యయనాలకు ఆదేశాలు
ఈనాడు - హైదరాబాద్
హైదరాబాద్ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలందించేలా మెట్రోరైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెట్రోరైలు ఎండీని ఆదేశించారు. కొత్త ఎలైన్మెంట్ వల్ల తక్కువ దూరంతో అత్యధిక ప్రయాణ ప్రయోజనం జరిగేలా.. నిర్మాణ వ్యయం తక్కువయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుత మెట్రో కారిడార్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు మెట్రోరైలు విస్తరణ చేపట్టి నగరం నలుదిశలా అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం-విమానాశ్రయ మార్గ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. ఈ మార్గానికి బదులుగా విమానాశ్రయ మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీ తోపాటు ఎల్బీనగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలన్నారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ కమిషనర్తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. మెట్రో రెండో దశ కొత్త ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. మత, చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా కొత్త లైన్ల నిర్మాణం కోసం రోడ్ల విస్తరణ జరగాలన్నారు. కొత్తగా ఎల్బీనగర్-హయత్నగర్, మియాపూర్-పటాన్చెరు, రాయదుర్గం- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్- విమానాశ్రయ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండో, మూడోదశ విస్తరణపై సీఎం మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇచ్చిన పవర్పాయింట్ ప్రజంటేషన్ను పరిశీలించారు.
రోడ్ల విస్తరణపై ఆదేశాలు
మైట్రోరైలు నిర్మాణం కోసం దారుల్ షిఫా కూడలి నుంచి షాలిబండ వరకు రోడ్డును విస్తరించాలన్న హెచ్ఎంఆర్ఎల్ ప్రతిపాదనలపై పాతబస్తీ ప్రజాప్రతినిధులతో సంప్రదించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల పాతనగరం ఇతర ప్రాంతాలతో సమానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. మెట్రోరైలు నిర్మాణ ప్రణాళికలో భాగంగా పాతనగరంలో వారసత్వ, మతపరమైన నిర్మాణాలు 103 ఉన్నాయని తేలిందని.. వీటికి నష్టం జరుగకుండా చూడాలన్నారు. ఈ ప్రక్రియలో అవసరమైతే తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పాల్గొంటానని.. పాతనగర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటానని చెప్పారు.
ఆ ప్రతిపాదన రద్దు
గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు రూ.6,250 కోట్లతో చేపట్టాలనుకున్న 31 కిలోమీటర్ల మార్గ నిర్మాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా అవుటర్ రింగ్ రోడ్డు ఉందన్నారు. ఈ మార్గానికి బదులుగా విమానాశ్రయ మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీ తోపాటు ఎల్బీనగర్ నుంచీ కనెక్ట్ చేయాలన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు గల 5 కిలోమీటర్ల మేర దూరాన్ని కూడా కలుపుతూ ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. విమానాశ్రయ మెట్రోకు సంబంధించి మార్చిన ఎలైన్మెంట్ ప్రకారం వయా ఓల్డ్ సిటీ, ఎల్బీనగర్కు సంబంధించిన ట్రాఫిక్ అధ్యయనం చేయడంతోపాటు డీపీఆర్ త్వరగా సిద్ధం చేయాలన్నారు. లక్ష్మిగూడ-జల్పల్లి -మామిడిపల్లి మార్గంలో నిర్మాణం జరపాలని.. ఎటువంటి ఆటంకాలు లేకుండా రోడ్డు మధ్యలో నిర్మాణంతో వ్యయం తగ్గుతుందని తెలిపారు. రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్) కోసం నిర్మాణమార్గం వెంట అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని చెప్పారు.
నగరాభివృద్ధికి బృహత్ ప్రణాళిక
వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలను తీర్చడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్(బృహత్ ప్రణాళిక) సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఓఆర్ఆర్ చుట్టూ ప్రాంతాలను గ్రోత్హబ్గా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. శ్రీశైలం హైవేపై ఎయిర్పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రోరైలు అనుసంధానం జరగాలని చెప్పారు. ఫార్మాసిటీ కోసం ఈ ప్రాంతంలో భూములను సేకరించినందున మెట్రో విస్తరణ అవసరమని పేర్కొన్నారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి శామీర్పేట వరకు, కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రోరైలు మూడో దశ విస్తరణ జరగాలని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
వీటికి ఆమోదం
- మియాపూర్-చందానగర్-బీహెచ్ఈఎల్-పటాన్చెరు (14 కిలోమీటర్లు)
- ఎంజీబీఎస్-ఫలక్నుమా-చాంద్రాయణగుట్ట-మైలార్దేవ్పల్లి-పీ7 రోడ్డు -ఎయిర్పోర్టు (23 కిలోమీటర్లు)
- నాగోల్-ఎల్బీనగర్-ఒవైసీ ఆసుపత్రి-చాంద్రాయణగుట్ట-మైలార్దేవ్పల్లి-ఆరాంఘర్-హైకోర్టు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతం (రాజేంద్రనగర్) (19 కిలోమీటర్లు)
- రిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు (వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ఐటీ జంక్షన్, ఐఎస్బీ రోడ్డు) (12 కిలోమీటర్లు)
- ఎల్బీనగర్-వనస్థలిపురం-హయత్నగర్ (8 కిలోమీటర్లు) ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు.
- వీటితోపాటు 40 కిలోమేటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని, తారామతి నుంచి నార్సింగి వయా నాగోల్, ఎంజీబీఎస్ చేపట్టాలని సూచించారు. వీటన్నింటికీ సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధంచేసి కేంద్ర నగరాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రికి ముసాయిదాను పంపించాలని సీఎం ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా