కేంద్రానికి కృతజ్ఞతలు
రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
30 లక్షల టన్నుల బియ్యం సేకరణకు ఆదేశించింది: కిషన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 2023-24 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి ఈ మేరకు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంటూ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కనీస మద్దతు ధరను, ప్రత్యేక హామీగా ఇచ్చిన రూ.500 బోనస్ను చెల్లించి రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలన్నారు.
భాజపాలో చేరిన పీఆర్టీయూ మాజీ నేతలు
పీఆర్టీయూ మాజీ నేత చెన్నకేశవరెడ్డి, మరికొందరు నేతలు సోమవారం కిషన్రెడ్డి సమక్షంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!