అందరికీ ఆసుపత్రుల అవసరం లేదు
దేశంలో కరోనా బాధితులందరికీ ఆసుపత్రుల అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. 85% మందికి సాధారణ మందులతోనే వైరస్ తగ్గిపోతుందని, మిగతా 15% మంది వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆసుపత్రులకు రావడం మేలన్నారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడం సాధ్యం కాదన్నారు.
అది ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదు
85% మందికి సాధారణ మందులతోనే తగ్గిపోతుంది
ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా
ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా బాధితులందరికీ ఆసుపత్రుల అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. 85% మందికి సాధారణ మందులతోనే వైరస్ తగ్గిపోతుందని, మిగతా 15% మంది వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆసుపత్రులకు రావడం మేలన్నారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడం సాధ్యం కాదన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘చాలామందిలో అనవసర భయాందోళనలు నెలకొన్నాయి. పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేనివారు, ఆక్సిజన్ స్థాయులు సక్రమంగానే ఉన్నవారు మున్ముందు ఇబ్బంది పడకూడదని ఆసుపత్రులకు వెళ్తే... అక్కడ రద్దీ పెరుగుతుంది. చికిత్స అవసరమైనవారు ఇబ్బందిపడాల్సి వస్తుంది. భయాందోళనలతో ఇంట్లో మందులు నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్లో కొరత ఏర్పడుతుంది. తొలిరోజు నుంచే మందులన్నీ వాడితే మున్ముందు సీరియస్ కాదనుకుంటారు. దానివల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. మొదటిరోజు నుంచే ఆక్సిజన్ పెట్టుకుంటే మున్ముందు దాని అవసరం రాదన్న ఉద్దేశంతో కొందరు ఇంట్లోనే సిలిండర్లు పెట్టుకొని అనవసరంగా వాడుతున్నారు. ఇదేమీ మంచి అలవాటు కాదు. 94పైన ఆక్సిజన్ స్థాయి ఉంటే అన్ని అవయవాలకూ ప్రాణవాయువు అందుతోందని లెక్క. కాబట్టి ఆందోళన అవసరం లేదు. 94-95 స్థాయిలో ఆక్సిజన్ ఉన్నవారు కృత్రిమంగా ఆక్సిజన్ పెట్టుకొని దాన్ని 97-98 స్థాయికి తీసుకెళ్లాలనుకోవడం సరికాదు. ప్రాణవాయువును దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఆక్సిజన్ స్థాయిని నిత్యం 95పైన ఉంచాలనుకోవద్దు. 92, 93 స్థాయిలో ఉన్నా, ఇబ్బందులేమీ రావు.
వృథా అవుతోంది...
సిలిండర్లు పెట్టుకున్నవారు భోజన సమయంలో మాస్కు పక్కనపెట్టి, అలాగే వదిలేస్తున్నారు. ఆ సమయంలో ఆక్సిజన్ను బంద్ చేయకపోవడం వల్ల వృథా అవుతోంది. ప్రాణవాయువును న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలి. ఇంట్లో ఉన్నవాళ్లు ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని అనిపించినప్పుడు బోర్లా పడుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ప్రాణవాయువు స్థాయి పెరుగుతుంది.
రెమ్డిసివిర్తో ప్రయోజనాలు లేవు...
రెమ్డెసివిర్ వల్ల పెద్దగా ప్రయోజనాలేమీ లేవు. చైనా, అమెరికా, డబ్ల్యూహెచ్వోలు నిర్వహించిన అధ్యయనాల్లో సానుకూల ఫలితాలు రాలేదు. రెమ్డెసివిర్ దొరక్కపోతే భయాందోళనలు అక్కర్లేదు. కరోనా సోకిన 85% మందిలో తేలికపాటి లక్షణాలే ఉంటున్నాయి. దగ్గు, జర్వం, జలుబుకే లక్షణాలు పరిమితమవుతాయి. సాధారణ మందులతో అవి క్రమంగా తగ్గిపోతాయి. ఆక్సిజన్ స్థాయి తగ్గి, జ్వరం తీవ్రమై... నీరసం, మగత, తీవ్రంగా వాంతులు అవుతుంటే అప్పుడు ఆసుపత్రిలో చేరే విషయమై నిర్ణయం తీసుకోండి. భయాందోళనల కారణంగా ఇంట్లో ఉండకుండా అందరూ ఆసుపత్రుల్లో చేరతామంటే అంతమందికి సేవలందించే స్థాయి ప్రపంచంలోని ఏ మౌలిక వసతుల వ్యవస్థకూ లేదు. కేసులు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలి’’ అని గులేరియా పేర్కొన్నారు.
ఇంట్లో ఉన్నా మాస్కు ధరించాలి: వీకే పాల్
మహిళలు నెలసరి సమయంలోనూ టీకా తీసుకోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. ‘‘రెండు వ్యాక్సిన్లు చాలా బాగా పనిచేస్తున్నాయి. అందువల్ల దొరికింది తీసుకోవాలి. ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నవారు ఐవర్మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐదు రోజులకు మించి దగ్గు ఉంటే బ్యుడెనెసైట్ తీసుకోవచ్చు. అవసరమైన వారికి మాత్రమే పడకలు ఉపయోగపడేలా చూడాలి. లేకపోతే డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో ఉన్నా, అందరూ మాస్కులు ధరించడం మేలు. పాజిటివ్ వచ్చినవారిని ఇంట్లో ఏకాంతంగా ఉంచే పరిస్థితి లేకుంటే బయట కేంద్రాలకు పంపండి. ఆసుపత్రుల కోసం చూడొద్దు’’ అని ఆయన సూచించారు.
మాస్కులు ధరించకుంటే 90% ముప్పు: లవ్ అగర్వాల్
మాస్కు ధరించకుండా ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా మాట్లాడుకుంటే... వైరస్ సోకే ముప్పు 90% ఉంటుందని వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెచ్చరించారు. ఇద్దరూ మాస్కులను సక్రమంగా ధరిస్తే వైరస్ నుంచి చాలామటుకు రక్షణ లభిస్తుందన్నారు. ‘‘భౌతికదూరం పాటించకుంటే... ఇన్ఫెక్షన్ సోకిన ఒక్క వ్యక్తి నుంచి నెలలో 406 మందికి వైరస్ సోకుతుంది. అదే 50% భౌతిక దూరం పాటిస్తే... 15కి, 75% భౌతిక దూరంతో 2.5కి బాధితుల సంఖ్య పరిమితమవుతుంది’’ అని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా