Published : 15/01/2023 00:44 IST

తీపి తిను... తియ్యగా మాట్లాడు!

సంక్రాంతి వస్తుందంటే ఓ నెల రోజుల ముందే పల్లెల్లో హడావుడి మొదలయ్యేది. వారం ముందు నుంచే.. అరిసెలు, పాకుండలు, జంతికలు వండే వారు. ఈ పండగని మనమే కాదు... దేశవ్యాప్తంగా అందరూ చేసుకొంటారు. మరి వాళ్లేం వండుకుంటారో తెలుసుకుందామా?

మహారాష్ట్రలో: నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు ఒకరికొకరు తినిపించుకుంటారు. తీపి తిను.. తియ్యగా మాట్లాడు అని శుభాకాంక్షలు చెప్పుకొంటారు.

అసోంలో: బియ్యప్పిండితో అట్లు పోసి అందులో బెల్లం, వేయించిన నల్ల నువ్వులని ఉంచిన తిల్‌పిటాలు తయారుచేస్తారు. ఇక కొబ్బరి లడ్లు, మరమరాల లడ్లు కూడా ఈ పండగ ప్రత్యేకమే.

గుజరాత్‌లో: ఈ పండక్కి ‘ఉందియు’ అనే వంటకాన్ని ప్రత్యేకంగా చేస్తారు. ఈకాలంలో దొరికే బీన్స్‌, వంకాయలు, చిలగడదుంపలు, ఆలుగడ్డలు ఇలా అన్ని రకాల కాయగూరల్నీ కొత్త మట్టి కుండలో వండుతారు. ఈ కూరని పూరీతో కలిపి తింటారు. మినప్పిండి, సెనగపిండి కలిపి చోలాఫలీ అనే చిప్స్‌ని కూడా ఇష్టంగా చేసుకుంటారు.

బిహార్‌లో: ఈ పండక్కి మరమరాలు, బెల్లంతో చేసిన లడ్డూలు, చిక్కీలు చేసుకుంటారు. వీటిని లాయ్‌ పట్టీలంటారు. పల్లీపట్టీలు కూడా ఇష్టంగా తింటారు.

బంగాల్‌లో: ఈత బెల్లంతో పాయసాన్ని ప్రత్యేకంగా చేసుకుంటారు. దీనిని నోలెన్‌ గుర్‌ పాయస్‌ అంటారు. చిక్కని పాలు... బెల్లం కలిసిన రుచితో నోలెన్‌ గుర్‌ పాయస్‌ అద్భుతంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని