Asia: కరోనా, ద్రవ్యోల్బణంతో ఆసియాలోని 46 దేశాల్లో పెరిగిన పేదరికం..!
ఆసియాలో కరోనా, జీవన వ్యయ భారంతో దాదాపు 70 మిలియన్లకు పైగా జనాభా పేదరికంలో కూరుకుపోయిందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) నివేదిక వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేసింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం (Inflation) గతేడాది ఆసియా (Asia)లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని దాదాపు 7 కోట్ల మందిని దుర్భరమైన పేదరికంలోకి నెట్టిందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) నివేదిక గురువారం వెల్లడించింది.
అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల జనాభాలో 3.9శాతానికి సమానమైన 15.5 కోట్ల మంది గతేడాది అత్యంత పేదరికంలో ఉన్నారని అంచనా వేసింది. వాస్తవానికి కరోనా సంభవించని పరిస్థితుల్లో ఉండాల్సిన పేదల సంఖ్య కంటే ఇది 6.7 కోట్లు ఎక్కువ. ఆసియా-పసిఫిక్లో జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మినహా.. ఆసియాలోని 46 ఆర్థిక దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. గత కొన్నేళ్లతో పోలిస్తే.. 2022లో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, సరఫరా గొలుసుకు అంతరాయం కలగడం కూడా ఇందుకు కారణం.
ధరల పెరుగుదల ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది. పేదలు ఆహారం, ఇంధనంపై అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో వైద్య, విద్య, నిత్యావసరాల లభ్యత కష్టమైంది. 2017 గణాంకాల ప్రకారం రోజుకు 2.15 డాలర్ల (రూ. 177) కంటే తక్కువ ఆదాయం సంపాధించేవారు అత్యంత పేదిరికంతో జీవిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆసియాలో 4.8 శాతం వృద్ధి కనిపిస్తోంది. గతంలోని 4.2 శాతం కంటే ఇది ఎక్కువ. ఆసియా ప్రాతం పేదరికం నుంచి పురోగతి సాధిస్తుందని భావిస్తున్నప్పటికీ.. 2030 వరకు 30.3 శాతం లేదా 1.26 బిలియన్ల జనాభా ఆర్థికంగా బలహీనంగానే ఉండవచ్చని ఏడీబీ అంచనా వేసింది.
‘‘ప్రపంచంలోని చాలా దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ.. ఆసియా-పసిఫిక్లోని దేశాలు కోలుకున్నాయి. కానీ, అధిక జీవన వ్యయాల భారం పురోగతిని దెబ్బతీస్తోంది. సామాజిక భద్రతను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా తిరిగి అభివృద్ధి పుంజుకోవచ్చు’’ అని ఏడీబీ ప్రముఖ ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే