Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
నదిలో డాల్ఫిన్లకు సమీపంలో ఈత కొట్టేందుకు దిగిన ఓ యువతి.. అంతలోనే సొర చేప దాడిలో మృతి చెందింది. ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాన్బెర్రా: సరదాగా డాల్ఫిన్ల(Dolphins)తో ఈత కొట్టేందుకు నదిలో దిగిన ఓ 16 ఏళ్ల బాలిక.. అంతలోనే సొర చేప(Shark Attack)కు బలయ్యింది. ఆస్ట్రేలియా(Australia)లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. ఓ బాలిక తన స్నేహితులతో కలిసి పెర్త్ (Perth) శివారు నార్త్ ఫ్రీమాంటిల్లోని స్వాన్ నది (Swan River)లో విహారానికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ చోట డాల్ఫిన్ల గుంపు కనిపించడంతో.. వాటికి సమీపంలో ఈత కొట్టేందుకు ఆమె నదిలోకి దూకింది. అంతలోనే ఓ షార్క్ ఆమెపై దాడికి దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఒడ్డుకు చేర్చి, కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.
ఏ రకం సొర చేప దాడి చేసిందో గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. నదిలోని ఆ భాగంలో షార్క్లు కనిపించడం అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నదిలోకి దిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తరోంగా కన్జర్వేషన్ సొసైటీ వివరాల ప్రకారం ఆస్ట్రేలియాలో చివరిసారి 1960లో నదిలో షార్క్ దాడి సంబంధిత మరణం నమోదైంది. సిడ్నీలోని రోజ్విల్లే బ్రిడ్జ్ వద్ద జరిగిన ఈ ఘటనలో 3.3 మీటర్ల పొడవైన బుల్ షార్క్ ఓ వ్యక్తిని బలిగొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.