China: శ్రీలంకతో కలిసి చైనా నౌక పరిశోధనలు..!
చైనాకు చెందిన పరిశోధన నౌక షి యాన్-6 శ్రీలంక తీరంలో పరిశోధనలు కూడా మొదలుపెట్టింది. ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగశాఖ ప్రకటించింది.
ఇంటర్నెట్డెస్క్: శ్రీలంకలోని కొలంబోలో లంగరేసిన చైనా పరిశోధక నౌక షి యాన్-6 కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ నౌక ఇక్కడకు రావడంపై భారత్, అమెరికాకు అభ్యంతరాలున్న విషయం తెలిసిందే. ఈ నౌక శ్రీలంకతో కలిసి మెరైన్ రీసెర్చి కార్యకలాపాలను చేపట్టినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో చైనాకు చెందిన పరిశోధక నౌకలు భారత్కు సమీపంలో ఇటువంటి పరిశోధనలు చేపట్టడం ఇది రెండోసారి.
మరోవైపు శ్రీలంక విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘అక్టోబర్ 30, 31 తేదీల్లో మెరైన్ సైంటిఫిక్ రిసెర్చి నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చాం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ నౌక దేశ పశ్చిమ తీరంలోని జలాల్లో ఉందని వెల్లడించారు. ఇక శ్రీలంకలోని నేషనల్ ఆక్వాటిక్స్ రిసెర్చి, నౌకాదళం, రుహునా యూనివర్శిటీకి చెందిన సిబ్బందిని ఈ నౌకలోకి అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు శ్రీలంక తీర సరిహద్దుల్లో సంయుక్తంగా సర్వే చేయడానికి కూడా ఈ నౌక అనుమతులు కోరినట్లు అధికారులు చెబుతున్నారు.
పరిశోధనల పేరుతో చైనా తరచూ శ్రీలంక జలాల్లోకి తన ఓడలను పంపిస్తోంది. 2014లో చైనా అణు జలాంతర్గామిని లంక తన పోర్టుల్లోకి అనుమతించింది. ఆ సమయంలో భారత్, శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తన బాలిస్టిక్ క్షిపణి, శాటిలైట్ ట్రాకింగ్ ఓడ యువాన్ వాంగ్-5ను శ్రీలంకలోని 2022లో హంబన్తోట పోర్టులో వారంపాటు ఉంచింది. అప్పుడూ భారత్ అభ్యంతరం తెలిపింది. ఈ నౌక భారత్లోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లోని అనేక భాగాలపై నిఘానేత్రం ఉంచగలదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే