సంక్షిప్త వార్తలు(4)
సముద్రపు నీటిని ముందుగా శుద్ధి చేయకుండా నేరుగా ఆమ్లజని, ఉదజనిగా విడగొట్టే ప్రక్రియను అంతర్జాతీయ పరిశోధకుల బృందం కనుగొంది. ఈ బృందానికి ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వర్సిటీకి చెందిన యావో ఝెంగ్ సారథ్యం వ్యవహరించారు.
సముద్రజలం నుంచి హరిత ఉదజని
మెల్బోర్న్: సముద్రపు నీటిని ముందుగా శుద్ధి చేయకుండా నేరుగా ఆమ్లజని, ఉదజనిగా విడగొట్టే ప్రక్రియను అంతర్జాతీయ పరిశోధకుల బృందం కనుగొంది. ఈ బృందానికి ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వర్సిటీకి చెందిన యావో ఝెంగ్ సారథ్యం వ్యవహరించారు. క్రోమియం ఆక్సైడ్ పూతతో చవకగా లభించే కోబాల్ట్ ఆక్సైడ్ను ఉత్ప్రేరకంగా ఉపయోగించి సముద్రజలాన్ని విద్యుత్ ప్రయోగంతో (ఎలక్ట్రోలైసిస్) ఆమ్లజని, హరిత ఉదజని (గ్రీన్ హైడ్రోజన్)గా విడగొట్టారు. సాధారణంగా ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియకు ముందు రివర్స్ ఆస్మోసిస్ డెసొలేషన్, క్షారీకరణ వంటి ప్రక్రియల్లో నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. శిలాజ ఇంధనాల బదులు హరిత ఉదజని ఉత్పత్తికి తాగునీటిని ఉపయోగించడం జలవనరుల కొరతను తీవ్రం చేస్తుంది. సముద్రజలం దాదాపు అనంతం కాబట్టి నీటి కొరత ఏర్పడదు.
మూత్రపరీక్షతో మెదడులో కణితి నిర్ధారణ
టోక్యో: మూత్రాన్ని విశ్లేషించడం ద్వారా.. మెదడులో కణితి ఉందో లేదో సులువుగా నిర్ధారించగల సరికొత్త పరీక్షను జపాన్ శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. సాధారణంగా మెదడులో కణితితో బాధపడుతున్న వ్యక్తుల మూత్రంలో కణితి సంబంధిత ఎక్స్ట్రాసెల్యులర్ వెసికిల్స్ (ఈవీ) ఉంటాయి. అత్యంత సూక్ష్మపరిమాణంలోని ఈ ఈవీల జాడను పసిగట్టడం ద్వారా కణితి నిర్ధారణ జరపొచ్చని జపాన్లోని నాగోయ, టోక్యో విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకోసం నానోవైర్లతో కూడిన పరికరాన్ని తయారుచేశారు. బాధితుల మూత్ర నమూనాల్లో సీడీ31, సీడీ63 అనే ఈవీ త్వచ ప్రొటీన్లను గుర్తించడం ద్వారా తొలి దశల్లోనే కణితి నిర్ధారణకు అది దోహదపడుతుందని వారు తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ బలోపేతానికి క్వాడ్ నిర్ణయం
వాషింగ్టన్: సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు మెషిన్ లెర్నింగ్తో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను కలిసికట్టుగా ఉపయోగించుకోవాలని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్ కూటమి నిర్ణయించింది. శ్వేతసౌధం గురువారం వెలువరించిన ఓ ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సభ్య దేశాలకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపింది. తమ తమ దేశాల్లోని ప్రజలకు, ప్రభుత్వాలకు, వ్యాపార సంస్థలకు వివిధ కార్యక్రమాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి క్వాడ్ కృషి చేస్తుందని వివరించింది.
బ్రిటన్లోకి భారతీయుల అక్రమ చొరబాటు
ఇంగ్లిష్ చానల్ ద్వారా వస్తున్నారు: హోంశాఖ
లండన్: ప్రమాదకరమైన చిన్న చిన్న పడవల ద్వారా సముద్ర మార్గం నుంచి భారతీయులు తమ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారని బ్రిటన్ హోంశాఖ వెల్లడించినట్లు యూకే మీడియా శుక్రవారం తెలిపింది. ‘‘సెర్బియాలో పర్యటించేందుకు భారతీయులకు వీసా అవసరం లేకపోవడంతో.. కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకొని ఇంగ్లిష్ చానల్ ద్వారా చిన్న చిన్న పడవల్లో బ్రిటన్లోకి వస్తున్నారు. శరణార్థులుగా వచ్చే వారు బ్రిటన్లో చదువుకోవడానికి ఉండే నిబంధనల వెసులుబాటును ఉపయోగించుకుంటున్నారు. ఇలా అక్రమంగా వచ్చే వారి జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది’’ అని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.