ఉత్తర కొరియాలో మానవ హక్కుల హననం
ఉత్తర కొరియాలో గర్భిణులను, స్వలింగ సంపర్కులను ఉరితీస్తూ ఆ దేశం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని దక్షిణ కొరియా వెల్లడించింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆగడాలు మితిమీరుతున్నాయని పేర్కొంది.
స్వలింగ సంపర్కులతోపాటు చిన్న నేరాలకు పాల్పడిన వారికీ మరణ శిక్షలు
దక్షిణ కొరియా నివేదిక వెల్లడి
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియాలో గర్భిణులను, స్వలింగ సంపర్కులను ఉరితీస్తూ ఆ దేశం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని దక్షిణ కొరియా వెల్లడించింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆగడాలు మితిమీరుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు దక్షిణ కొరియా యునిఫికేషన్ మినిస్ట్రీ గురువారం 450 పేజీల నివేదికను వెలువరిచింది. ఉత్తర కొరియా ప్రజల జీవించే హక్కు పెనుప్రమాదంలో పడిందని, చట్టంలో లేని, మరణశిక్షకు అనర్హమైన కేసులకు సైతం ఉరిశిక్షలు విధిస్తున్నారని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. మతపరమైన కార్యకలాపాలకు యత్నించడం, మూఢనమ్మకాలు, డ్రగ్స్ వినియోగించడం, దక్షిణ కొరియాకు చెందిన వీడియోలను వీక్షించడం వంటి వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తూ మరణ దండన విధిస్తున్నారని పేర్కొంది. కిమ్ రాజ్యంలో కఠిన నిబంధనలను భరించలేక 2017-2022 మధ్య ఇతర దేశాలకు వలస వెళ్లిన 500 మంది ఉత్తర కొరియన్లను విచారించి దక్షిణ కొరియా ఈ నివేదిక వెలువరించింది. ‘‘ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ చిత్రపటాన్ని చూపిస్తూ నృత్యం చేసిన ఓ ఆరు నెలల గర్భిణిని బహిరంగంగా ఉరితీశారు. ఓ స్టేడియంలో ఆరుగురు టీనేజర్లు మత్తు మందు సేవించడంతోపాటు దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియోను చూస్తున్నారని వారిని కాల్చి చంపారు. స్వలింగ సంపర్కులు, మత కార్యక్రమాలు నిర్వహించేవారు, విదేశాలకు పారిపోయేందుకు యత్నించిన వారికీ ఉరిశిక్షలు విధిస్తున్నారు. దేశంలోని మరుగుజ్జుల జాబితాను తయారు చేయమని నర్సులపై పాలనా యంత్రాంగం ఒత్తిడి చేసింది. ఓ మరుగుజ్జు మహిళ గర్భాశయాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించింది. బలవంతంగా మానవ ప్రయోగాలూ నిర్వహిస్తున్నారు’’ అని దక్షిణ కొరియా నివేదిక వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.