3 నెలల్లో 14 శిఖరాలు అధిరోహించేందుకు యాత్ర
ప్రపంచంలోని 14 ఎత్తయిన పర్వతాలను మూడు నెలల్లోనే అధిరోహించి ప్రపంచ రికార్డును నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నార్వేకు చెందిన పర్వతారోహకురాలు క్రిస్టిన్ హరిల (37) తెలిపారు.
ఇప్పటికే ఎనిమిది పూర్తి
నార్వే పర్వతారోహకురాలి ప్రయత్నం
కాఠ్మాండూ: ప్రపంచంలోని 14 ఎత్తయిన పర్వతాలను మూడు నెలల్లోనే అధిరోహించి ప్రపంచ రికార్డును నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నార్వేకు చెందిన పర్వతారోహకురాలు క్రిస్టిన్ హరిల (37) తెలిపారు. ఇందులో భాగంగానే నేపాల్లోని మనసులు పర్వతాన్ని అధిరోహించడానికి కాఠ్మండూ వచ్చిన ఆమె.. తన లక్ష్యం గురించి మంగళవారం మాట్లాడారు. ఇప్పటికి తన ప్రపంచయాత్ర మొదలై 40 రోజులు అయిందని, ఈ వ్యవధిలో 8 పర్వత శిఖరాలపై కాలు మోపినట్లు తెలిపారు. కొద్ది రోజుల్లో మనసులు పర్వతం.. తర్వాత పాక్లోని కే2 శిఖరాన్ని అధిరోహించాలని ప్రణాళిక వేసుకున్నట్లు వివరించారు. 2019లో ఓ పర్వతారోహకుడు ఆరు నెలల్లో 14 శిఖరాలను అధిరోహించి నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టడానికి ఈ యాత్ర ప్రారంభించానని హరిల పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.