Google: ఆ రాజకీయ నాయకుడికి గూగుల్ రూ.4కోట్లు చెల్లించాల్సిందే..!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్కు ఆస్ట్రేలియాలోని ఓ కోర్టు గట్టి షాకిచ్చింది. ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్లో వైరల్ అయిన వివాదాస్పద వీడియోల కారణంగా అతడు రాజకీయాలను వీడాల్సి
ఆస్ట్రేలియా కోర్టు భారీ జరిమానా
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్కు ఆస్ట్రేలియాలోని ఓ కోర్టు గట్టి షాకిచ్చింది. ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్లో వైరల్ అయిన వివాదాస్పద వీడియోల కారణంగా అతడు రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, అందువల్ల ఆ నేతకు 5,15,000(భారత కరెన్సీలో దాదాపు రూ.4కోట్లు) డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే..
ఆస్ట్రేలియాలోని న్యూ పౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్గా ఉన్న జాన్ బరిలారోను విమర్శిస్తూ.. జోర్డాన్ శాంక్స్ అనే రాజకీయ విశ్లేషకుడు 2020 చివర్లో యూట్యూబ్లో కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు చూపించనప్పటికీ.. జాన్పై శాంక్స్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే 2021 అక్టోబరులో జాన్ రాజకీయాలను వీడారు. ఈ వ్యవహారం కాస్తా ఫెడరల్ కోర్టుకు చేరడంతో దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది.
‘‘జాన్కు వ్యతిరేకంగా అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోల ద్వారా గూగుల్ వేలాది డాలర్లు ఆర్జించింది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా పదేపదే జాన్ను అవినీతిపరుడంటూ ఆరోపణలు చేయడం.. విద్వేష ప్రసంగం కంటే తక్కువేమీ కాదు. గూగుల్, శాంక్స్ ప్రచార వీడియోల కారణంగానే జాన్ 2021 అక్టోబరులో శాశ్వతంగా రాజకీయాలను వీడాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో గూగుల్ తీరు సమర్థనీయం కాదు. జాన్ పరువుకు భంగం కలిగించినందుకు గానూ గూగుల్ ఆయనకు 7,15,000 ఆస్ట్రేలియన్ డాలర్లు(5,15,00 అమెరికన్ డాలర్లు) చెల్లించాలి’’అని ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై గూగుల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2020లో శాంక్స్ ఈ వీడియోలు పోస్ట్ చేయగా.. దాదాపు 8లక్షల వ్యూస్ వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.