Imran Khan: ఏడు స్థానాల్లో పోటీ చేసి.. ఆరుచోట్ల గెలిచాడు
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే ఏడు స్థానాల నుంచి పోటీ చేయగా.. అందులో ఆరు స్థానాల్లో విజయం సాధించారు.
ఇస్లామాబాద్: అవిశ్వాస తీర్మానంతో ఓటమిచెంది పదవి కోల్పోయిన పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో పీటీఐ పార్టీ భారీ విజయం సాధించింది. జాతీయ అసెంబ్లీతోపాటు స్థానిక ప్రావిన్సులకు సంబంధించి మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉపఎన్నిక జరగగా.. ఎనిమిదింటిని పీటీఐ కైవసం చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఒక్కరే ఏడు స్థానాల నుంచి పోటీ చేయగా.. అందులో ఆరు స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకున్నారు. తాజా ఉప ఎన్నికలను రిఫరెండంగా పేర్కొన్న ఇమ్రాన్.. అధికారపక్షంపై ఈస్థాయిలో విజయం సాధించడం మామూలు విషయం కాదని అక్కడి రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అవిశ్వాస తీర్మానంతో ఓటమి తర్వాత.. నేషనల్ అసెంబ్లీ సభ్యులు రాజీనామా చేయాలని పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ తమ పార్టీకి చెందిన సభ్యులకు సూచించారు. అందుకు అనుగుణంగా పీటీఐ నేతలు రాజీనామా చేశారు. అందులో ఎనిమిది స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ఇటీవల నిర్వహించింది. వీటితో పాటు పంజాబ్ ప్రావిన్సులోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిపింది.
ఇందులో భాగంగా నేషనల్ అసెంబ్లీలో (పార్లమెంట్ దిగువసభ) ఎనిమిది స్థానాలకు గాను.. ఏడు చోట్ల నుంచి పీటీఐ తరఫున ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే పోటీకి దిగారు. తాజా ఫలితాల్లో ఆరు స్థానాల్లో విజయం సాధించగా ఒక్క కరాచీ స్థానంలో మాత్రమే ఓడిపోయారు. మరో నియోజకవర్గం ముల్తాన్ నుంచి పోటీ చేసిన పీటీఐ అభ్యర్థి ఓటమి చెందారు. ఇలా ఆరు నేషనల్ అసెంబ్లీ స్థానాలతో పాటు మరో రెండు అసెంబ్లీ ప్రావిన్సుల్లోనూ పీటీఐ విజయం సాధించింది. అధికార కూటమి మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. అంతకుముందు (ఈ ఏడాది జులైలో) పంజాబ్ అసెంబ్లీకి 20స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పీటీఐ పార్టీ 15 స్థానాలను కైవసం చేసుకుంది. చట్టసభ సభ్యులు తీసుకున్న నిర్ణయం తప్పని.. వారి తప్పిదాన్ని గుర్తించేందుకు తాజా ఫలితాలు మరో అవకాశాన్ని కల్పిస్తున్నాయని పీటీఐ సెక్రటరీ జనరల్ అసద్ ఉమర్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికలు జరగాలని ప్రజలు నిర్ణయించినట్లు ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందని మాజీ మంత్రి ఫవాద్ చౌద్రీ అన్నారు.
ఇదిలాఉంటే, పాకిస్థాన్ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఎన్ని చోట్ల నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే, ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే మాత్రం ఏ స్థానాలను వదులుకుంటారో ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఇలా ఇమ్రాన్ ఖాన్ మాదిరిగా ఒకేసారి అనేక స్థానాల్లో పోటీ చేయడం మాత్రం అరుదని అక్కడి రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆరు చోట్ల గెలిచినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఎక్కడా ప్రాతినిధ్యం వహించరని పీటీఐ పార్టీ పేర్కొంది. అయితే, షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబర్లో పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, అంతకుముందే ఎన్నికలను నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ పార్టీ (పీటీఐ) పట్టుబడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
Dubai Rains: దుబాయ్ నగరంలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. ఈ ఎడారి దేశానికి వెళ్లే ప్రయాణికులకు భారత ఎయిర్లైన్స్ అడ్వైజరీ జారీ చేశాయి. -
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్