Morality Police: దిగొచ్చిన ఇరాన్.. నైతిక పోలీసు విభాగం రద్దు!
రెండు నెలలకుపైగా కొనసాగుతోన్న హిజాబ్ ఆందోళనల క్రమంలో.. ఇరాన్(Iran) ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహ్సా అమినీ మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని(Morality Police) రద్దు చేసింది.
టెహ్రాన్: రెండు నెలలకుపైగా కొనసాగుతోన్న హిజాబ్ ఆందోళనల క్రమంలో.. ఇరాన్(Iran) ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అమీని మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని(Morality Police) రద్దు చేసింది. ‘నైతిక పోలీసు విభాగానికి.. న్యాయవ్యవస్థతో సంబంధం లేదు. దాన్ని రద్దు చేశాం’ అని దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మోంతజేరి ప్రకటించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. హిజాబ్ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? అనే అంశంపై పార్లమెంటు, న్యాయవ్యవస్థలు కలిసి సమాలోచనలు జరుపుతున్నాయంటూ అటార్నీ జనరల్ వెల్లడించిన మరుసటి రోజే ఈ ప్రకటన వచ్చింది.
నిరసనలకు తక్షణ కారణం ఇదే..
ఈ ఏడాది సెప్టెంబరులో అమీని అనే యువతి హిజాబ్ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి.. ఆమె మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అమీని మృతిపై సెప్టెంబర్ 17న నిరసనలు మొదలయ్యాయి. క్రమంగా ఉద్ధృతంగా మారి.. రాజధాని టెహ్రాన్తోసహా దేశవ్యాప్తంగా అనేక చోట్లకు వ్యాపించాయి. రెండు నెలలకుపైగా ఇప్పటికీ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. స్థానిక భద్రతా బలగాలు ఈ నిరసనలను కర్కశంగా అణచివేస్తోన్నాయన్న విమర్శలొస్తున్నాయి.
ఏంటీ నైతిక పోలీసు విభాగం?
ఇరాన్లో షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన బాలికలు, మహిళలు తప్పనిసరిగా డ్రెస్కోడ్ పాటించాలి. తమ జుట్టును పూర్తిగా కప్పి ఉంచేలా హిజాబ్ ధరించాలి. హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించే మహిళలను అరెస్టు చేసేందుకు కూడా వీలు కల్పించారు. ఆ చట్టం అమలును పర్యవేక్షించేందుకు 2005లో నైతిక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇరాన్లో ఒక ప్రత్యేక పోలీసు విభాగం. స్థానికంగా ‘గస్త్-ఎ-ఇర్షాద్’గా పిలుస్తారు. పౌరులు ఇస్లామిక్ నైతిక విలువలను గౌరవించేలా చూడటం, సక్రమంగా దుస్తులు ధరించనివారిపై చర్యలు తీసుకోవడం వంటివి ఇందులోని సిబ్బంది విధుల్లో భాగం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.