Jack Ma: పాక్లో జాక్మా అనూహ్య పర్యటన..కారణమేమిటో..?
చైనా మిత్రదేశం పాకిస్థాన్(Pakistan)లో అలీబాబా సంస్థ వ్యవస్థాపకుడు జాక్మా(Jack Ma) అనూహ్య పర్యటన చేశారు. ఇది వ్యాపార వర్గాలను ఆశ్చర్యపర్చింది. అయితే పర్యటన వివరాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి.
ఇస్లామాబాద్: చైనా పాలక వర్గాన్ని విమర్శించి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన అలీబాబా సంస్థల (Alibaba Group) వ్యవస్థాపకుడు జాక్ మా(Jack Ma) పలు దేశాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన పాకిస్థాన్(Pakistan)లో ప్రత్యక్షమయ్యారు. ఈ మేరకు పాక్ స్థానిక పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే పర్యటన వివరాలు గోప్యంగా ఉండటంతో.. అనేక ఊహాగానాలు వస్తున్నాయి.
బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్( BOI) మాజీ ఛైర్మన్ మహమ్మద్ అజ్ఫర్ అహ్సాన్ ఈ పర్యటనను ధ్రువీకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. జూన్29న జాక్మా లాహోర్ వచ్చారని, 23 గంటల పాటు అక్కడ ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వ అధికారులు, మీడియాతో ఎటువంటి సంభాషణ జరపలేదు. ఒక ప్రైవేటు ప్రాంతంలో బస చేసిన ఆయన.. జూన్ 30న తిరిగి వెళ్లిపోయారు. ఆ పర్యటన వేళ.. జాక్ మా వెంట ఏడుగురు వ్యాపారవేత్తలు ఉన్నట్లు సమాచారం. ఆయన నేపాల్ నుంచి పాకిస్థాన్ చేరుకున్నారని సమాచారం.
ఈ పర్యటనతో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. వారు పాక్లో వ్యాపార అవకాశాలను అన్వేషించినట్లు తెలుస్తోంది. అలాగే ట్రేడ్ సెంటర్లో సందర్శన, ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. అయితే ఏమైనా ఒప్పందాలు జరిగాయా..? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఈ ఆకస్మిక రాక వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ.. రానున్న రోజుల్లో పాకిస్థాన్కు ఇది సానుకూల ఫలితాలను ఇస్తుందని అహ్సాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని, దీని గురించి చైనా దౌత్యకార్యాలయానికి కూడా సమాచారం లేనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం జాక్మాతో సమావేశాలు జరిపి, ఆయనకున్న అనుభవాన్ని దేశ ప్రగతి కోసం ఉపయోగించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
అలీబాబా గ్రూప్ను స్థాపించి అపర కుబేరుడిగా ఎదిగిన జాక్మా.. 2020లో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. తర్వాత ప్రభుత్వం యాంట్ గ్రూప్పై చర్యలు చేపట్టింది. కొన్ని నెలలపాటు బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించలేదు. దీంతో 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాత జాక్మా బహిరంగంగా కనిపించిన సందర్భాలు అరుదు. జపాన్, ఆస్ట్రేలియా, థాయ్లాండ్ వంటి దేశాల్లో ఉన్నట్లు ఫొటోలు మాత్రం దర్శనమిచ్చాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత మార్చిలో జాక్మా చైనాకు తిరిగి వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365