Belarus: ‘నోబెల్’ పురస్కార గ్రహీతకు 10 ఏళ్ల జైలు!
బెలారస్కు చెందిన హక్కుల న్యాయవాది, నోబెల్ పురస్కార గ్రహీత బియాలియాత్స్కీకి అక్కడి కోర్టు తాజాగా పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2021 జులై నుంచి జైల్లోనే ఉన్న ఆయనకు గతేడాది అక్టోబరులో నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
మిన్స్క్: హక్కుల న్యాయవాది, గతేడాది నోబెల్ శాంతి పురస్కారం(Nobel Peace Prize) దక్కించుకున్న బెలారస్కు చెందిన ఆలెస్ బియాలియాత్స్కీ(Ales Bialiatski)కి స్థానిక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించేలా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, స్మగ్లింగ్కు పాల్పడ్డారన్న అభియోగాలపై ఓ కేసులో బియాలియాత్స్కీ(60)తోపాటు ఆయన స్థాపించిన హక్కుల సంస్థ ‘వియాస్నా(Viasna)’కు చెందిన మరో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. వీరిలో వాలియన్సిన్ స్టెఫానోవిచ్కు తొమ్మిదేళ్లు, ఉలాద్జిమిర్ లాబ్కోవిక్జ్కు ఏడేళ్లు, జిమిత్రి సలాయుకు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.
బియాలియాత్స్కీ 1980ల్లో బెలారస్(Belarus)లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఒకరు. ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. 2020లో జరిగిన ఎన్నికల విషయంలో దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. బియాలియాత్స్కీతో పాటు అతని ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. 2021 జులై నుంచి వీరు జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. సలాయు అప్పటికే బెలారస్ వదిలి వెళ్లిపోయారు. బియాలియాత్స్కీ జైల్లో ఉన్న సమయంలోనే గతేడాది అక్టోబరులో ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది.
ఇదిలా ఉండగా.. లుకాషెంకో తన పాలనలో నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు.. బెలారస్ ప్రతిపక్ష నేత స్వియాత్లానా సిఖానౌస్కాయ తాజా తీర్పును ఖండించారు. ‘ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు, వారిని విడిపించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి’ అని ఓ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.