Artillery: ఉత్తర కొరియా దూకుడు.. శతఘ్నులతో భీకర గర్జన!
వరుస క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో నిలుస్తోన్న ఉత్తర కొరియా(North Korea).. తాజాగా శతఘ్నులతో విరుచుకుపడింది! తన తూర్పు, పశ్చిమ తీరాల నుంచి ఏకంగా 130 రౌండ్లకుపైగా ఫిరంగి గుండ్లను సముద్రంలోకి పేల్చినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.
సియోల్: వరుస క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో నిలుస్తోన్న ఉత్తర కొరియా(North Korea).. తాజాగా శతఘ్నులతో విరుచుకుపడింది! తన తూర్పు, పశ్చిమ తీరాల నుంచి ఏకంగా 130 రౌండ్లకు పైగా ఫిరంగి గుండ్లను సముద్రంలోకి పేల్చినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఇరు దేశాల సరిహద్దు సమీపంలోనే ఈ మిలిటరీ డ్రిల్స్ చేపట్టినట్లు ఆరోపించింది. కొన్ని షెల్స్ ‘బఫర్ జోన్’లో పడ్డాయని, 2018నాటి సమగ్ర సైనిక ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించినట్లేనని విమర్శించింది. ఈ క్రమంలోనే శతఘ్నుల వినియోగంపై ఆ దేశానికి పలు హెచ్చరికలు పంపినట్లు దక్షిణ కొరియా(South Korea) రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు.. ఈ వ్యవహారంపై కిమ్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ, సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ICBM) సహా వరుస మిసైల్ ప్రయోగాలు చేపట్టింది. యుద్ధ విమానాల విన్యాసాలు, ఇతరత్రా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. మరోవైపు, ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు దక్షిణ కొరియా, అమెరికా, జపాన్లూ సైతం ఈ ఏడాది మిలిటరీ డ్రిల్స్ను వేగవంతం చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం