North Korea: ఆసియా నాటో ఏర్పాటుకు అమెరికా సాకులు..!
ఆసియాలో నాటో తరహా సైనిక కూటమి ఏర్పాటుకు అమెరికా యత్నాలు చేస్తోందని ఉత్తరకొరియా విమర్శించింది. ఇటీవల దక్షిణ కొరియా, జపాన్లతో అమెరికా సైనిక సహకారాన్ని
ఇంటర్నెట్డెస్క్: ఆసియాలో నాటో తరహా సైనిక కూటమి ఏర్పాటుకు అమెరికా యత్నాలు చేస్తోందని ఉత్తరకొరియా విమర్శించింది. ఇటీవల దక్షిణ కొరియా, జపాన్లతో అమెరికా సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. సైనిక కూటమి ఏర్పాటు ప్రణాళికలో ఇదొక భాగమని ఆరోపించింది. ‘‘ఉత్తరకొరియా నుంచి మప్పు పొంచి ఉందంటూ అమెరికా ప్రచారం చేయడం వెనుక ఉన్న వాస్తవిక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసియా-పసిఫిక్లో సైనిక ఆధిపత్యాన్ని సాధించడమే దాని ఉద్దేశం’ అని ఉ.కొరియా ప్రతినిధి పేర్కొన్నారు. రక్షణ పరంగా వేగంగా మారుతున్న పరిణామాలకు అనుకూలంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.
గత వారం నాటో సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, దక్షిణ కొరియా ప్రధాని యూన్ సుక్ యోల్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమం కేవలం కొరియా ద్వీపకల్పానికే కాకుండా మొత్తం తూర్పు ఆసియా, ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని ఓ అంగీకారానికి వచ్చారు. ఉత్తరకొరియాను అదుపు చేసే చర్యలను మరింత తీవ్రం చేస్తామని వారు పేర్కొన్నారు. ‘‘అమెరికా-జపాన్, అమెరికా-దక్షిణ కొరియాల కూటములు శత్రు దేశాల దుందుడుకు చర్యలను కట్టడి చేసే సామర్థ్యాలను మెరుగు పర్చుకోవాలి. దీనిలో భాగంగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియా మధ్య త్రిముఖ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలి’’ అని కిషిదా పేర్కొన్నారు.
1910 నుంచి 45 వరకు జపాన్ దళాలు కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలం పాటు దక్షిణ కొరియా-జపాన్ల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. ద.కొరియా మాజీ అధ్యక్షుడు మూన్జే ఇన్ హయాంలో ఇవి తీవ్రమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ పంచుకోవడంపై ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సంబంధాలు మెరుగుపర్చుకోవాలని ఇరు దేశాధినేతలు అంగీకరించారు.
ఈ ఏడాది ఉత్తరకొరియా భారీ సంఖ్యలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. అదే సమయంలో మరోసారి అణు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.