Prince Harry: ప్రిన్స్ హ్యారీ పిల్లలకు రాయల్ హోదా!
ప్రిన్స్ హ్యారీ(Prince Harry), మేఘన్ (Meghan Markle) దంపతుల కుమారుడు ఆర్చీ, కుమార్తె లిలిబెట్లకు రాజకుంటుంబ వారసులుగా గుర్తిస్తూ.. రాయల్ ఫ్యామిలీ వెబ్సైట్లో మార్పులు చేసింది.
లండన్: ప్రిన్స్ హ్యారీ (Prince Harry), మేఘన్ మార్కెల్ (Meghan Markle) పిల్లలను రాజకుటుంబం వారసులుగా బకింగ్హామ్ ప్యాలెస్ (Buckingham Palace) గుర్తించింది. ఈ మేరకు గురువారం వారికి ప్రిన్స్, ప్రిన్సెస్ హోదా కల్పించించింది. ఇకపై వారిని ప్రిన్స్ ఆర్చీ, ప్రిన్సెస్ లిలిబెట్గా పిలుస్తారు. అంతకుముందు తమ పిల్లలకు ప్రిన్స్, ప్రిన్సెస్ హోదాలతో నామకరణం చేస్తున్నట్లు ప్రిన్స్ హ్యారీ దంపతులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతుల కుమారుడు ఆర్చీ, కుమార్తె లిలిబెట్లకు రాజకుంటుంబ వారసులుగా గుర్తిస్తూ.. రాయల్ ఫ్యామిలీ వెబ్సైట్లో మార్పులు చేసింది. దీంతో వీరు రాజకుటుంబ సింహాసనం వారసుల జాబితాలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నారు.
రెండేళ్ల క్రితం ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ను రాచరిక హోదాను వదులుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి వారు రాజకుంటుంబానికి దూరంగా అమెరికాలో కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. ఆ సమయంలో తమ పిల్లల్ని మాత్రం రాజకుంటుంబ సంప్రదాయాలతోనే పెంచుతామని వెల్లడించారు. ఇప్పటి వరకు వీరిని మాస్టర్ ఆర్చీ, మిస్ లిలిబెట్లుగా పిలుస్తున్నారు. ఇకపై వీరి పేర్లకు ముందు ప్రిన్స్, ప్రిన్సెస్ చేరనున్నాయి. బ్రిటన్ రాజకుటుంబం నిబంధనల ప్రకారం చక్రవర్తి మనుమడు, మనుమరాలు.. యువరాణి, యువరాజు కావచ్చు. దాని ప్రకారమే ప్రిన్స్ హ్యారీ, మేఘన్ రాజకుటుంబ హోదా వదులుకున్నప్పటికీ.. వారి పిల్లలకు రాచరిక హోదా కల్పించారు. గతంలో తమ పిల్లలకు రాజరిక హోదా కల్పించేందుకు బకింగ్హామ్ ప్యాలెస్ నిరాకరించిందని మేఘన్ ఆరోపించింది.
ప్రిన్స్ హ్యారీ ఇటీవలే స్పేర్ (Spare) పేరుతో తన జీవిత చరిత్రను రాశారు. ఇందులో రాజకుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలు బయటపెట్టారు. తన తండ్రి కింగ్ ఛార్లెస్, సవతి తల్లి కెమిల్లా, అన్నయ ప్రిన్స్ విలియం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తన భార్య మేఘన్ మార్కెల్ను రాజకుటుంబం వేదనకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ హ్యారీ పిల్లలను రాజకుటుంబ వారసులుగా బకింగ్హామ్ ప్యాలెస్ గుర్తించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.