Russia: ప్రపంచం పుతిన్ను చంపాలనుకుంటోంది : జెలెన్స్కీ
పుతిన్కు ప్రాణభయం పెరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వాగ్నర్ ప్రైవేటు సైన్యం చావు దెబ్బతిందని పేర్కొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: తమ దేశంపై యుద్ధం కారణంగా రష్యా (Russia) కిరాయి సైన్యం వాగ్నర్ (Wagner) గ్రూప్ తీవ్రంగా దెబ్బతిందని ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రపంచం పుతిన్ను చంపాలనుకుంటోందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్పెయిన్ ప్రధాని కీవ్ పర్యటన సందర్భంగా జెలెన్స్కీ స్పానిష్ పత్రికలతో మాట్లాడుతూ.. ‘‘ఈ యుద్ధంలో కిరాయి సైన్యం భారీగా నష్టపోయింది. మా దళాలు దాదాపు తూర్పు ఉక్రెయిన్లోనే 21,000 మంది వాగ్నర్ సైనికులను హతమార్చాయి. మరో 80,000 మంది ఆ గ్రూప్ సైనికులు గాయపడ్డారు. వాగ్నర్ పీఎంసీ భారీగా నష్టపోయింది. రష్యా సైన్యం ప్రేరేపిత మూకగా మేము వారిని చూస్తాం. వారంతా ఖైదీలు.. వారి వద్ద కోల్పోవడానికి ఏమీ లేదు’’ అని వెల్లడించారు. పుతిన్పై వాగ్నర్ బాస్ ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన వారం తర్వాత జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా ఓ విలేకరి మీకు ప్రాణభయం లేదా..? అని జెలెన్స్కీని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ప్రస్తుత పరిస్థితి నాకంటే పుతిన్కే ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. కేవలం రష్యాలో మాత్రమే నన్ను చంపాలనుకుంటున్నారు. కానీ, ప్రపంచం మొత్తం పుతిన్ను చంపాలనుకుంటోంది’’ అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
12 రోజుల తర్వాత మళ్లీ ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా..!
దాదాపు 12 రోజుల వ్యవధి తర్వాత రష్యా మరోసారి ఉక్రెయిన్పై డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని కీవ్పై డ్రోన్లు దాడి చేసిన విషయాన్ని ఉక్రెయిన్ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. కాకపోతే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని కూల్చివేసిందని వెల్లడించింది. ‘‘మరోసారి శత్రువులు కీవ్పై దాడి చేశారు. కానీ, ఈ సారి ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం లేదు’’ అని కర్నల్ జనరల్ సెర్హీ పాప్కోవ్ టెలిగ్రామ్ ఛానెల్లో వెల్లడించారు. స్పెయిన్ ప్రధాని పర్యటన సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365