Jaahnavi Kandula: జాహ్నవి మృతి ఘటనపై సియాటెల్ మేయర్ క్షమాపణ
Jaahnavi Kandula: జాహ్నవి మృతి ఘటనపై అమెరికాలోని భారత సమాజానికి చెందిన దాదాపు 20 మంది ప్రతినిధులు శనివారం సియాటెల్ మేయర్, పోలీస్ ఉన్నతాధికారిని కలిశారు.
సియాటెల్: అమెరికాలో జరిగిన ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడినందుకు భారత సమాజాన్ని సియాటెల్ మేయర్ బ్రూస్ హారెల్ క్షమాపణలు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జాహ్నవి మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి తెలిపారు.
అమెరికాలోని భారత సమాజానికి చెందిన దాదాపు 20 మంది ప్రతినిధులు శనివారం సియాటెల్ మేయర్, పోలీస్ ఉన్నతాధికారిని కలిశారు. పోలీసు అధికారి అమానవీయ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సియాటెల్ నగరాన్ని శాంతి, సామరస్యాలకు వేదికగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
జాహ్నవి మృతిపై నవ్వలేదు.. సియాటెల్ పోలీసు వివరణ
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఈ ఏడాది జనవరిలో సియాటెల్లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యాన్ని భారత్ డిమాండ్ చేసింది. దీనిపై లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అమెరికా హామీ ఇచ్చింది. అయితే, ఆ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని తాజాగా సదరు పోలీసు అధికారి వివరణ ఇచ్చారు. న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి తాను నవ్వానని.. బాధితురాలిని అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.