ఎన్నికల ముందు.. బిడ్డకు జన్మనిచ్చిన పీఎం అభ్యర్థి..!
థాయ్లాండ్లో ప్రధాని పదవికి పోటీ పడుతోన్న పేటోంగ్టార్న్ షినవత్రా(Paetongtarn Shinawatra) రేసులో ముందున్నారు. రెండువారాల్లో ఎన్నికలనగా ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు.
బ్యాంకాక్: థాయ్లాండ్(Thailand)లో రెండువారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఫలితాల్లో తదుపరి ప్రధాని ఎవరో తేలనున్నారు. ఈ సమయంలో పీఎం పోస్టుకు గట్టి పోటీ ఇస్తోన్న పేటోంగ్టార్న్ షినవత్రా( Paetongtarn Shinawatra) ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె దేశ ప్రజలకు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఆమె థాయ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్రా చిన్న కుమార్తె. 15 ఏళ్ల క్రితం ఆమె తండ్రి స్థాపించిన ఫ్యూ థాయ్ పార్టీ(Pheu Thai Party) తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల రేసులో ముందువరుసలో ఉన్నట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే తన చివరిపేరు షినవత్రా కూడా ఆమెకు కలిసొస్తుందని తెలుస్తోంది. ఆ కుటుంబానికి ఉత్తర, ఈశాన్య థాయ్లాండ్ గ్రామీణ ఓటర్ల మద్దతు ఉంది. రెండువారాల్లో ఎన్నికలు జరగనుండగా.. ఆమె బిడ్డకు జన్మినిచ్చారు. ఈ చిత్రాలను ఈ రోజు ఆమె ట్విటర్లో షేర్ చేశారు. నిండు గర్భిణీగా ఉన్న సమయంలోనూ వీడియో కాల్స్ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, మద్దతుదారులతో మాట్లాడటం మానలేదు. ప్రస్తుతం ఆమె ఫ్యూ పార్టీకి హెడ్. ఆమె వయస్సు 36 సంవత్సరాలు.
2001 నుంచి 2006 వరకు తక్షిన్ షినవత్రా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సోదరి ఇంగ్లక్ షినవత్రా 2011 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్నారు. వీరిద్దరు థాయ్ సైన్యం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడంతో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. తమపై నమోదైన అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు ఈ ఇద్దరు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
విదేశాల్లో ఉన్న తక్షిన్ ప్రస్తుతం స్వదేశానికి రావాలని భావిస్తున్నారని ఓ అంతర్జాతీయ కథనం వెల్లడించింది. తిరిగివస్తే.. అవినీతి కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. శిక్ష పడినా సరే తన కుటుంబానికి దగ్గరగా ఉండాలని ఆయన భావిస్తున్నారట. ‘నాకిప్పుడు ఏడుగురు మనవలు/మనవరాళ్లు. నేను విదేశంలో ఉన్నప్పుడే వీరంతా జన్మించారు. నా వయస్సు 74. వారిని పెంచేందుకు నేను స్వదేశం రావడానికి నాకు అనుమతి ఇవ్వండి’ అని తక్షిన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా ఎన్నికల మీదే ఉందని, తన తండ్రి తిరిగి రావడం గురించి కాదని పేటోంగ్టార్న్ షినవత్రా(Paetongtarn Shinawatra) వెల్లడించారు. మరోపక్క ఒకవేళ ఆమె ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. మిలిటరీ నియమించిన 250 సెనెటర్ల మద్దతు పొందుతారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రధాని ఎన్నికలో ఈ నియమిత సెనెటర్లది కీలక పాత్ర.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే