Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడికి వైద్యులు ఎక్స్రే తీయించగా.. అతడి పొట్టలో 15 సెం.మీల పొడవైన చాకు కనిపించింది.
ఖాఠ్మాండూ: కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడిని పరిశీలించిన వైద్యులకు ఊహించని అనుభవం ఎదురైంది. కారణం అతడి పొట్టలో ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవైన చాకు (Knife Blade) కనిపించింది. ఆ పదునైన వస్తువు కారణంగా బాధితుడి అంతర్గత అవయవాలకు ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. నేపాల్ (Nepal)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ‘క్యూరియస్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
నేపాల్కు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రికి వెళ్లాడు. అయితే, అతడిలో వికారం, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలేవి కనిపించలేదు. రక్త స్థాయిలు సాధారణంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడి శరీరాన్ని పరిశీలించగా.. పొట్ట కుడిభాగంలో కుట్లు వేసి ఉన్న గాటు కనిపించింది. ఏం జరిగిందని వైద్యులు ప్రశ్నించగా.. అంతకుముందు రోజు గొడవ జరిగిందని, ఈ క్రమంలో గాయమైందని తెలిపాడు.
భారత్తో విభేదాలు.. ఆ ‘ఐదు కళ్ల’నే నమ్ముకొన్న ట్రూడో..!
దీంతో వైద్యులు ‘ఎక్స్-రే’ తీయించగా.. పొట్టలో 15 సెం.మీల పొడవైన చాకు ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయిన వైద్యులు.. శస్త్రచికిత్స నిర్వహించి ఆ వస్తువును తొలగించారు. ఆ చాకు ఒక వైపు నుంచి మరొక వైపునకు తిరిగినప్పటికీ.. పొట్ట భాగంలోని అవయవాలు ఏవీ తీవ్రంగా దెబ్బతినలేదని వైద్యులు తెలిపారు.
చాకు పొడిచినప్పుడు పెద్ద గాయమేమీ కాకపోవడం, పైగా మద్యం మత్తులో ఉండటంతో ఏం జరిగిందో బాధితుడు గుర్తించలేకపోయినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. ఘటన జరిగిన రోజు స్థానికంగానే ఓ ఆరోగ్య కార్యకర్త అతడి గాయానికి కుట్లు వేసినట్లు పేర్కొంది. తరువాతి రోజు పొట్ట భాగంలో అసౌకర్యంగా అనిపించడంతో అతడు వైద్యుల వద్దకు వెళ్లగా.. అసలు విషయం బయటపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Iraq: ఇరాక్లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్లోని దియాలా ప్రావిన్స్లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు