Omicron Scare: చైనాలో ఒమిక్రాన్ కలవరం.. మూడు నగరాల్లో లాక్డౌన్!
జీరో కొవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తోన్న చైనా.. అతిపెద్ద నగరాలైన షియాన్, టియాంజిన్లలో లాక్డౌన్ ఆంక్షలను ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అన్యాంగ్ నగరంలోనూ లాక్డౌన్ విధించింది.
వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు
బీజింగ్: కొవిడ్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో మరోసారి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు వెలుగు చూడడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్కు సమయం దగ్గరపడుతోన్న వేళ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం చైనాకు సవాలుగా మారింది. జీరో కొవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తోన్న చైనా.. అతిపెద్ద నగరాలైన షియాన్, టియాంజిన్లలో లాక్డౌన్ ఆంక్షలను ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అన్యాంగ్ నగరంలోనూ లాక్డౌన్ విధించింది. దీంతో చైనాలో ఇప్పటివరకు లాక్డౌన్ విధించిన నగరాల సంఖ్య మూడుకు చేరింది.
చైనాలోని సెంట్రల్ హెనాన్ ప్రావిన్సుకు చెందిన అన్యాంగ్ నగరంలో 84 కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కేవలం రెండు రోజుల్లోనే 58 కేసులను గుర్తించారు. వీటిలో ఎక్కువభాగం స్థానికంగా వ్యాప్తి చెందినట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. వీటిలో కొన్నింటికి టియాంజిన్ మునిసిపాలిటీకి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తులతో సంబంధముందని అనుమానిస్తున్నారు. దీంతో కాంటాక్ట్ ట్రేసింగ్ తోపాటు భారీ స్థాయిలో కొవిడ్ టెస్టులు నిర్వహించేందుకు గానూ నగరం మొత్తం లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. దాదాపు 55లక్షల జనాభా కలిగిన నగరంలో ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. అత్యవసర సేవలు మినహా వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పర్యాటక కేంద్రాలుగా పేరొందిన షియాన్ నగరంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తుండగా, టియాంజిన్లో పాక్షిక లాక్డౌన్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. కోటికి పైగా జనాభా కలిగిన ఆయా నగరాల్లో ప్రజలందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ చేపడుతున్నారు.
ఇక చైనాలో మంగళవారం ఒక్కరోజే 200కేసులు బయటపడినట్లు అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. వీటిలో 110 కేసులు స్థానికంగానే వ్యాప్తి చెందాయని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 3458 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో 21 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. 2019లో వుహాన్లో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 4636 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది. తాజాగా పలు నగరాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడడం, స్థానికంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగడంతో భారీ స్థాయిలో టెస్టింగ్, ట్రేసింగ్, లాక్డౌన్ ఆంక్షలను చైనా అధికారులు అమలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.