Trump: అమెరికా ఉపాధ్యక్షుడిగా అతడు తగిన వ్యక్తే..రామస్వామిపై మరోసారి ట్రంప్ ప్రశంసలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) మరోసారి భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి(Vivek Ramaswamy)పై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన్ను మెచ్చుకున్నారు.
వాషింగ్టన్: రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు.
ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివేక్ గురించి స్పందించారు. ‘ఆయన చాలా చాలా తెలివైన వ్యక్తి. ఆయన ఎంతో చురుగ్గా ఉంటారు’ అని అన్నారు. అలాగే మీరు ఆయన్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా పరిగణించారా? అని ప్రశ్నించగా.. ‘ఆయన తగిన వ్యక్తి అని భావిస్తున్నాను’ అని బదులిచ్చారు.
ఇటీవల ఆగస్టు 23వ తేదీన రిపబ్లికన్ పార్టీ తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్(Republican debate) జరిగింది. దీనిలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొనలేదు. ఈ చర్చా కార్యక్రమంలో వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ తదితర ఆశావహులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ట్రంప్ తన అభిప్రాయం వెల్లడిస్తూ వివేక్ను అభినందించారు. ‘డిబేట్లో వివేక్ రామస్వామి నిజాయతీ కారణంగా భారీ విజయం సాధించినట్లు నేను భావిస్తున్నాను. థాంక్యూ వివేక్’ అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో అందరికంటే ట్రంప్(Donald Trump) ముందు ముందున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల పార్టీ సదస్సులో రామస్వామి తన వాదనలతో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ, ట్రంప్పై కేసులు, ఇతర కారణాలతో అధ్యక్ష పోటీలో చివరి వరకు నిలుస్తారా.. అన్నదే సందేహాస్పదంగా మారింది. ఆయనతో పోటీ పడటానికి రామస్వామి యత్నిస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైతే తాను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండటానికి కూడా రామస్వామి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ