Afghanistan: తాలిబన్ల రెండేళ్ల పాలన.. 200 మంది మాజీ ప్రభుత్వాధికారుల హత్య!
తాలిబన్ల రెండేళ్ల పాలనలో అఫ్గానిస్థాన్లో 200కుపైగా మాజీ ప్రభుత్వాధికారులు హతమయ్యారు. ఈ మేరకు ఐరాస ఓ నివేదిక విడుదల చేసింది.
కాబుల్: అఫ్గానిస్థాన్ (Afghanistan)ను తాలిబన్లు స్వాధీనం చేసుకుని ఇటీవలే రెండేళ్లు పూర్తయ్యింది. ఈ మధ్య కాలంలో దాదాపు 200కుపైగా మాజీ ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది తాలిబన్ల (Taliban) చేతిలో హతమైనట్లు ఐరాస (UN) తన నివేదికలో పేర్కొంది. సైన్యం, పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలను ఎక్కువగా లక్ష్యం చేసుకున్నట్లు అఫ్గానిస్థాన్లో ఐరాస సహాయ మిషన్ (UNAMA) తెలిపింది. 2021 ఆగస్టు 15నుంచి ఈ ఏడాది జూన్ వరకు.. అఫ్గాన్ మాజీ ప్రభుత్వ అధికారులు, భద్రతా బలగాల విషయంలో 800కుపైగా హక్కుల ఉల్లంఘనల కేసులను యూఎన్ఏఎంఏ నమోదు చేసింది. విచారణ లేకుండా హత్యలు, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధం, చిత్రహింసలు వంటివి ఇందులో ఉన్నాయి.
తాలిబన్లు చుట్టుముట్టడంతో అప్పటి దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ‘ఈ క్రమంలోనే అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. మాజీ ప్రభుత్వ అధికారులు, భద్రతాబలగాలపై విరుచుకుపడ్డారు. వందల మందిని అక్రమంగా నిర్బంధించారు. చిత్రహింసలు పెట్టారు. కొందరిని నిర్బంధ కేంద్రాల్లోనే చంపేశారు. మరికొందరిని గుర్తుతెలియని ప్రదేశాలకు తీసుకెళ్లి హతమార్చారు. హత్యల్లో దాదాపు సగం కేసులు మొదటి నాలుగు నెలల్లోనే చోటుచేసుకున్నాయి. కాబుల్, కాందహార్, భాల్క్ ప్రావిన్స్లలో అత్యధికంగా ఉల్లంఘనలు నమోదయ్యాయి. 424కుపైగా ఏకపక్ష అరెస్టులు, 144కుపైగా చిత్రహింసలు, దాదాపు 14 అదృశ్య ఘటనలు ఇందులో ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది.
పసిఫిక్లో టెన్షన్.. మరో 48 గంటల్లో అణు జలాల విడుదల..!
మాజీ ప్రభుత్వం, సైన్యంతో సంబంధం ఉన్న వ్యక్తుల దుస్థితిని ఈ నివేదిక ప్రదర్శిస్తోందని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ తెలిపారు. అందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తామని బహిరంగ ప్రకటన చేసిన తాలిబన్లు.. మాట తప్పి, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారన్నారు. హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ పరిణామాలతో దేశ భవిష్యత్తు స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని నివేదిక పేర్కొంది. మరోవైపు.. తాలిబన్ నేతృత్వంలోని అఫ్గాన్ విదేశాంగ శాఖ ఈ నివేదికను తోసిపుచ్చింది. తాలిబన్ల చేతిలో మాజీ ప్రభుత్వ సిబ్బంది, సైన్యంపై హక్కుల ఉల్లంఘనల గురించి తమకు తెలియదని పేర్కొంది. అసలు ఇటువంటి ఘటనలే నమోదు కాలేదని తెలపడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్