Ukraine Crisis: ఉక్రెయిన్కు బల్గేరియా మిగ్-29లు..?
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకొంది. బల్గేరియాకు ఎనిమిది ఎఫ్-16 యుద్ధవిమానాలను విక్రయించాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకొంది. బల్గేరియాకు ఎనిమిది ఎఫ్-16 యుద్ధవిమానాలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. ‘‘ఈ ప్రతిపాదన బల్గేరియా సామర్థ్యాన్ని ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా బలోపేతం చేస్తుంది. నల్ల సముద్రంలో బల్గేరియా ఎయిర్ ఫోర్స్ అత్యాధునిక విమానాలను మోహరించే అవకాశం లభిస్తుంది’’ అని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోపరేషన్ ఏజెన్సీ వెల్లడించింది.
నాటో సభ్యదేశమైన బల్గేరియా నుంచి ఉక్రెయిన్కు మిగ్ 29 విమానాలను సరఫరా చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బల్గేరియా అవసరాలు తీర్చేలా అమెరికా ఎఫ్-16లు సమకూరుస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వివరణ ఇచ్చింది. ఈ ఒప్పందానికి రష్యా-ఉక్రెయిన్ ఘర్షణకు ఎటువంటి సంబంధం లేదని వెల్లడిచింది.
సోవియట్ తయారీ మిగ్-29 విమానాలను కలిగి ఉన్న నాటోదేశాల్లో బల్గేరియా, స్లొవాకియా, పోలాండ్ ఉన్నాయి. తాజాగా బల్గేరియాకు అమెరికా విమానాలను సరఫరా చేయడం ఆసక్తికరంగా మారింది. దీనిపై పెంటగాన్ ప్రతినిధి జాన్ కెర్బీ మాట్లాడుతూ.. బల్గేరియా విమానాల లోటును తాము భర్తీ చేస్తున్నట్లుగా చూడటం లేదని వెల్లడించారు. ఈ ప్రచారాన్ని బల్గేరియా కూడా తోసిపుచ్చుతోంది. ప్రస్తుతం తాము సైనిక సాయం అందించే పరిస్థితి లేదని బల్గేరియా రక్షణ మంత్రి పెట్కోవ్ వెల్లడించారు. అటువంటి సాయానికి బల్గేరియా పార్లమెంట్ ఆమోదం తప్పని సరి అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.