UN Chief: మహిళలపై హింస ‘పెద్ద క్యాన్సర్’ వంటిది.. దానిపై పోరాడాల్సిందే : గుటెరస్
సామాజిక మాధ్యమాల్లో మహిళలపై జరిగే హింస అనేది ‘పెద్ద క్యాన్సర్’ వంటిదని.. దానిపై పోరాడేందుకు ప్రతి దేశమూ ‘అత్యవసర ప్రణాళిక’ను రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు.
ముంబయి: మహిళలపై జరిగే హింస పెద్ద క్యాన్సర్ వంటిదని.. దానిపై పోరాడేందుకు ప్రతి దేశమూ ‘అత్యవసర ప్రణాళిక’ రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఐఐటీ బాంబే విద్యార్థుల ముఖాముఖిలో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. మహిళా సామాజికవేత్తలు, రాజకీయ నాయకులే లక్ష్యంగా సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడిచిన 75ఏళ్లలో భారత్ సాధించిన ప్రగతి, కొవిడ్ వంటి అత్యవసర సమయాల్లో ప్రపంచ దేశాలకు భారత్ అందించిన సహకారాన్ని ఐరాస చీఫ్ కొనియాడారు.
‘మహిళలపై జరిగే హింస అనే అంశం ముఖ్యమైనదే కాదు, అత్యవసరమైనది. ఎందుకంటే రోజురోజుకు పరిస్థితులు మెరుగుపడకపోగా.. మరింత దిగజారుతున్నాయి. మహిళా కార్యకర్తలు, రాజకీయ నాయకులపై సోషల్ మీడియాలో భయంకరమైన ప్రచారం జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ఈ హింస అత్యంత దారుణంగా తయారయ్యింది. మహిళలపై ఇటువంటి హింసను అరికట్టేందుకు ప్రతి దేశం కూడా అత్యవసర ప్రణాళికను రూపొందించుకోవాలి’ అని పేర్కొన్నారు.
ఇక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపైనా గుటెరస్ మాట్లాడారు. ‘కేవలం సంపన్న దేశాలకు అనుకూలంగా ఉన్న అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ ‘నైతికంగా దివాలా’ తీసింది. సంపన్న దేశాలకు ప్రయోజనాల కోసం ఆ దేశాల్లోనే చీలిక వచ్చింది. ఆ పరిస్థితిని మార్చే సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ రూపకల్పనలో సంస్కరణలు అవసరం. ఇందులో భారత్ క్రియాశీలంగా వ్యవహరించడాన్ని నేను కూడా ప్రోత్సహిస్తా. ఇందుకు జీ20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడం ఓ సదవకాశంగా భావిస్తోన్నా’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.