
విద్యుదాఘాతంతో పొగలు.. తల్లి మృతి
ప్రాణాపాయస్థితిలో ఇద్దరు పిల్లలు
అనంతపురం నేరవార్తలు, న్యూస్టుడే: ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి పొగలు వ్యాపించి.. తల్లి మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి అనంతపురంలో జరిగింది. వన్టౌన్ సీఐ రవిశంకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గోరంట్ల మండలం మందలపల్లికి చెందిన మల్లికార్జున.. తన భార్య అరుణ (38), పిల్లలు నిత్యసాయి, ఫల్గుణతో కలిసి నగరంలోని శారదానగర్లో ఉంటున్నారు. ఆయన రెడ్డిపల్లి వ్యవసాయ కార్యాలయంలో తాత్కాలిక డ్రైవరుగా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తుండగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తిరిగి సరఫరా కాగానే ఇంటి వరండాలో ఉన్న విద్యుత్తు మీటర్ బాక్సులో షార్ట్ సర్క్యూట్ అయింది. అక్కడ సోఫాలు ఉండటంతో నిప్పురవ్వలు వాటిపై పడి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. భయపడిన మల్లికార్జున ఇంట్లో నుంచి బయటకు వచ్చి కాపాడాలని గట్టిగా కేకలు వేశారు. స్థానికులు వెంటనే విద్యుత్తు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్తు అధికారులు సరఫరా నిలిపివేశారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అరుణ, ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో ఉన్నారు. 108కు సమాచారం ఇవ్వడంతో వారిని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అరుణ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్పుర్కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్పై మండిపడుతున్న ఫ్యాన్స్!