
తాజా వార్తలు
ఎస్ఈసీ ఆదేశాలను నిలిపివేసిన హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం అర్ధరాత్రి జారీ చేసిన ఉత్తర్వులకు బ్రేక్ పడింది. గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్నవాటినే కాకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఈసీ దృష్టికి తీసుకురావడంతో.. దానికి పరిష్కారంగా అలాంటి ఓట్లనూ లెక్కించాలంటూ ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను నిలిపివేయాలని ఆదేశించింది. స్టాంపు, టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని సూచించింది. ప్రత్యేకంగా లెక్కించిన ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించవచ్చని తెలిపింది. ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ తక్కువ ఉంటే ఫలితం నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాలను ఎస్ఈసీ రిటర్నింగ్ అధికారులకు తెలియజేసింది.
న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగింది: బండి సంజయ్
హైకోర్టు తీర్పుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టిన కోర్టుకు శిరస్సు వచ్చి ధన్యావాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చూసే ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకొని న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో భాజపా సాధించిన మొదటి నైతిక విజయమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 5గంటల నుంచి 6 గంటల వరకు 12 శాతం నుంచి 18శాతానికి పోలింగ్ ఎలా పెరిగిందనే అంశంపై హైకోర్టు విచారణ జరపాలని కోరారు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఉన్నట్టుండి 90శాతానికి పోలింగ్ పెరిగిందన్నారు. ఇందులో ఏదో గ్యాంబ్లింగ్ జరిగిందనే అనుమానం ఉందని బండి సంజయ్ తెలిపారు.
హైకోర్టు నిర్ణయం అమలు చేయాలి: కాంగ్రెస్
స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులతో వేసిన ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడం శుభపరిణామమని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ అన్నారు. తక్షణమే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఎస్ఈసీ పార్థసారధికి లేఖ రాశారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
