
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణ తీరు సరిగా లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిత్యం 50వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అవసరం ఉన్నప్పుడు రోజుకు 50వేల పరీక్షలు చేస్తామని నివేదికలో పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలేమో కానీ.. ఎన్నికలు పూర్తయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు మాత్రం వస్తాయని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యనించింది. అదే జరిగితే కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపించడంలేదని ఆక్షేపించింది.
ఈ విషయంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో.. వివరణ ఇవ్వాలని శ్రీనివాసరావును న్యాయస్థానం ఆదేశించింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- 2-1 కాదు 2-0!
- వైట్హౌస్లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- ఇక చాలు
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- సాహో భారత్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
