
తాజా వార్తలు
తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 28,791 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,586కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 351 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,87,468కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,781 ఉండగా వీరిలో 2,178 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 76,02,975కి చేరింది.
ఇవీ చదవండి..
సీరం ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
Tags :