
ఆకస్మిక తనిఖీలు, శ్వాస పరీక్షలు అంతంతే!
రైలుకు ఒక్కరే లోకోపైలట్
సహాయ లోకోపైలట్ లేక ఒక్కరిపైనే భారం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు, హైదరాబాద్: హంద్రీ ఎక్స్ప్రెస్ను ఎంఎంటీఎస్ ఢీకొన్న ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోజూ రెండు లక్షల మంది ప్రయాణికులను తరలిస్తున్న ఎంఎంటీఎస్ నిర్వహణలో లోపాలు పెద్దఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. 16 ఏళ్లుగా ఎంఎంటీఎస్కు సంబంధించి పెద్దగా ప్రమాదాలు జరగకపోవడంతో వీటిపై అధికారులు దృష్టి సారించలేకపోయారని చెబుతున్నారు. లోకోపైలట్ల నుంచి ప్రతీ విషయంలో అధికారులు చూసీచూడనట్లు వదిలేయడమే ఈ ప్రమాదానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
* జిల్లాల్లో తిరిగే ఎక్స్ప్రెస్, ఇతర ప్రతి రైలులో లోకోపైలట్, సహాయ లోకోపైలట్ ఉంటారు. లోకోపైలట్ రైలును నడిపితే సహాయంగా ఉన్న వారు సిగ్నల్స్ను చూడటంతోపాటు ఏ ప్రాంతంలో ఎంత వేగంతో వెళ్లాలో హెచ్చరిస్తుంటారు. ఎంఎంటీఎస్లో ఒక్కరే లోకోపైలట్ అన్నీ చూసుకోవాలి.
* ఎంఎంటీఎస్ రైళ్లలోనూ సహా లోకోపైలట్ను నియమిస్తే ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
* దక్షిణ మధ్య రైల్వేలో లోకోపైలట్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం ఎంఎంటీఎస్పై పడుతోందని చెబుతున్నా అధికారులు అంగీకరించడంలేదు. 52మంది లోకోపైలట్లను దీనికోసమే నియమించామని చెబుతున్నారు.
* రైలు ఎక్కే ముందు లోకోపైలట్కు బ్రీత్ఎనలైజర్ పరీక్ష నిర్వహించాలి. ఇది పూర్తిగా జరుగుతుందా? లేదా? అన్న దానిపై సందేహాలున్నాయని రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు.
* లోకోపైలట్లను ఆకస్మికంగా లోకోఇన్స్పెక్టర్ తనిఖీ చేయాలి. పూర్తిస్థాయిలో ఈ తనిఖీలు జరగడం లేదని చెబుతున్నారు. లోకోపైలట్లకు పునశ్చరణ తరగతులు సైతం తూతూమంత్రంగానే జరుగుతున్నట్లు సమాచారం.
* నగరంలో ఎంఎంటీఎస్ నడుస్తున్న 45 కిలోమీటర్ల రైల్వేట్రాక్లో 6 చోట్ల రైళ్లు క్రాస్ అయ్యే పరిస్థితులున్నాయి. ఈ ఆరు చోట్ల సిగ్నల్స్ను ఉద్యోగులే చేపడుతున్నారు. ఈ సిగ్నళ్ల వద్ద లోకోపైలట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో పైలట్ల పట్ల కఠినంగా వ్యవహరించేలా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
* సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి, ఫలక్నుమా, హఫీజ్పేట, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో రైల్వే లైన్లు క్రాస్ అవుతాయి. ఈ ప్రాంతాల్లో ఇంకా మాన్యువల్ సిగ్నలింగ్ వ్యవస్థ కొనసాగుతోంది. కొన్ని స్టేషన్ల దగ్గర 4 లైన్ల పట్టాలు.. మరికొన్ని చోట్ల 5, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 10 లైన్ల పట్టాలుంటాయి. వీటికి తోడు యార్డులకు వెళ్లే లైన్లూ ఉంటాయి. ఈ ఆరు చోట్ల బయట నుంచి వచ్చే రైళ్లను స్టేషన్లోని వివిధ ప్లాట్ఫారాలకు మార్చాల్సి ఉండడంతో రైల్వే లైన్ల క్రాసింగ్ ఉంటుంది. ఇక్కడి సిబ్బంది అప్రమత్తతే ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. కాచిగూడ ఘటన నేపథ్యంలో ఇక్కడ అప్రమత్తం చేస్తేనే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
ముఖ్యాంశాలు
దేవతార్చన

- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- రాహుల్ ట్వీట్తో వైఖరి మార్చుకున్న సేన
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- మరోసారి నో చెప్పిన సమంత
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- సినిమా పేరు మార్చాం