Stock market: రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్‌గా

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 45 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ పూర్తి ఫ్లాట్‌గా ముగిసింది.

Published : 08 May 2024 16:03 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడమే ఇందుక్కారణం. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో దాదాపు 600 పాయింట్ల మేర లాభనష్టాల మధ్య చలించి చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ 22,300 స్థాయిని నిలబెట్టుకుంది.

సెన్సెక్స్‌ 73,225 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం కాసేపు లాభాల్లోకి వచ్చినా.. మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 73,073.92 - 73,684.93 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 45.46 పాయింట్ల నష్టంతో 73,466.39 వద్ద ముగిసింది. నిఫ్టీ నిన్నటి ముగింపు వద్దే (22,302.50) స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. సెన్సెక్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టపోగా.. టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, ఎల్‌అండ్‌టీ, మారుతీ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు 82.27 డాలర్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు