ఆ రెండక్షరాలే తారకమంత్రం!
వాల్మీకి రామాయణంలోని శ్లోకాల సంఖ్య ఇరవై నాలుగు వేలు. అయితే పరమశివుడి వద్ద వంద కోట్ల శ్లోకాలున్న రామాయణం ఉండేది.
వాల్మీకి రామాయణంలోని శ్లోకాల సంఖ్య ఇరవై నాలుగు వేలు. అయితే పరమశివుడి వద్ద వంద కోట్ల శ్లోకాలున్న రామాయణం ఉండేది. శివుడు ఆ వంద కోట్ల శ్లోకాలనూ దేవతలు, రాక్షసులు, రుషులకు సమానంగా పంచగా.. ఒక శ్లోకం మిగిలింది. ఒక్కొక్కరికీ పది అక్షరాల చొప్పున ఆ శ్లోకాన్ని కూడా పంచగా.. అందులో ఇంకా రెండు అక్షరాలు మిగిలిపోయాయి.అది చూసిన దేవతలు ‘పరమేశ్వరా! మిగిలిపోయిన ఆ రెండక్షరాలను ఎలా పంచుతారు? ఇక్కడ మేం మూడు జట్లుగా ఉన్నాం కదా’ అని సందేహం వెలిబుచ్చారు. ఈసారి పరమేశ్వరుడు చిరునవ్వు చిందించాడే తప్ప, వారి ప్రశ్నకు బదులు చెప్పలేదు. దేవతలు మళ్లీ అడిగారు. అప్పుడు మహేశ్వరుడు చిద్విలాసంగా నవ్వి.. ‘వాటిని మాత్రం నేనెవ్వరికీ ఇవ్వను. నా దగ్గరే ఉంచు కుంటాను’ అన్నాడు. ‘ఇంతకీ ఆ రెండక్షరాలు ఏవో తెలియజేయండి స్వామీ’ అని అర్థించారు దేవతలు. మహాశివుడు తల పంకించి.. ‘అవి మరేవో కాదు.. రా.. మ.. అనే రెండక్షరాలు. ఆ రెండూ చాలా దివ్యమైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రెండూ కలిస్తే.. తారకమంత్రం’ అంటూ తెలియజేశాడు.
సాయి అనఘ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!