APPSC Group4: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు

APPSC గ్రూప్‌ 4 ఉద్యోగాల భర్తీకి మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారైంది. ఏప్రిల్‌ 4న జరిగే ఈ పరీక్షకు మార్చి 27నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

Published : 24 Mar 2023 20:26 IST

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ(APPSC) ఖరారు చేసింది.  రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ  ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిచేసిన అధికారులు.. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 4న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షకు మార్చి 27 నుంచి  అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఈ ఉద్యోగాల కోసం గతంలో నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్షకు 2,11,341 మంది అభ్యర్థులు హాజరు కాగా.. వారిలో 11,574 మంది మాత్రమే  మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని