యూజీలో ప్రవేశానికి సీయూఈటీ

సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ-యూజీ) - 2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరొచ్చు.

Published : 11 Apr 2022 01:44 IST

సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ-యూజీ) - 2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరొచ్చు.

ప్రైవేట్, డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా చేసుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తెలిపింది. పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి అప్పగించింది. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఇగ్నో, అలీగర్‌ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించొచ్చు.  జులైలో జరగనున్న ఈ పరీక్ష పూర్తి వివరాలు మీకోసం...

అర్హత: యూజీ: ఇంటర్మీడియట్‌/తత్సమాన అర్హత, 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. 

పీజీ: ఏదైనా డిగ్రీ/ సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో..

పరీక్ష ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.650. ఓబీసీ(ఎన్‌సీఎల్‌)కు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550

పరీక్ష విధానం: యూజీ పరీక్ష రెండు విడతలుగా జరుగుతుంది. మొదటి స్లాట్‌లో 195 నిమిషాలు(3:15 గం।।.), రెండో స్లాట్‌లో 225 నిమిషాలు(3:45 గం।।.). మల్టిఫుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. కొన్ని సెక్షన్లలో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఎంచుకున్న సబ్జెక్టుల ప్రకారం పరీక్ష వ్యవధి మారుతుంది.  సిలబస్‌: ఎక్కువ ప్లస్‌టూ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోంచే    ఉంటుంది.

పరీక్ష విధానం

పరీక్షను మూడు భాగాలుగా విభజిస్తే...

సెక్షన్‌-1ఎ: 13 భాషల్లో... రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వాస్తవిక, సాహిత్య అంశాలు) ప్రశ్నలుంటాయి. 

సెక్షన్‌-1బి: 20 భాషల్లో (తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషలు)... లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబ్యులరీ సంబంధిత ప్రశ్నలడుగుతారు. 50 ప్రశ్నలకు 40 సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 45 నిమిషాల సమయం ఇస్తారు. 

సెక్షన్‌-2: 27 డొమైన్‌ సంబంధిత సబ్జెక్టుల్లో.. (కనీసం ఒకటి, గరిష్ఠంగా 6 సబ్జెక్టులు) ఏదైనా ఎంచుకోవచ్చు. ఎంసీక్యూ తరహాలో 50 ప్రశ్నలుంటాయి. 40 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. సమయం 45 నిమిషాలు (ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్‌ వంటి అంతర్జాతీయ భాషలు కూడా ఉంటాయి).

సెక్షన్‌-3: జనరల్‌ టెస్ట్‌(జీటీ)... కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ (అరిథ్‌మెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్‌ లాంటి ప్రాథమిక గణితాంశాలు), జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ అండ్‌ ఎనలైటికల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలుంటాయి. 75 ప్రశ్నల్లో, 60 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 60 నిమిషాల సమయం ఇస్తారు.

పరీక్ష మాధ్యమం..

13 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ, పంజాబీ, ఒడియా) రాయొచ్చు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా.. 

దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 06.05.2022

పరీక్ష: జులై మొదటి లేదా రెండో వారంలో ఉండొచ్చు.

వెబ్‌సైట్‌: https://cuet.samarth.ac.in/, www.nta.ac.in

ఈ పరీక్షకు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఉండదు. అభ్యర్థులకు అధిక కటాఫ్‌ల నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం కొంత తగ్గుతుంది. యూనివర్సిటీకో ప్రవేశపరీక్ష రాయాల్సినవసరం ఉండదు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు