మేనేజ్‌మెంట్‌ ప్రవేశాలకు మ్యాట్‌

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆల్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) ప్రకటన వెలువడింది.

Updated : 25 Apr 2022 06:22 IST

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆల్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) ప్రకటన వెలువడింది.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా సంబంధిత డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/  బీకాం/ బీ.టెక్‌) చివరి సంవత్సరం చదువుతున్నవారు అర్హులు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో...

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌(పీబీటీ) లేదా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) లేదా ఇంటర్నెట్‌ బేస్డ్‌ టెస్ట్‌(ఐబీటీ). 

ఫీజు: ఒక పరీక్షకు రూ.1850, రెండు పరీక్షలు (పీబీటీ + సీబీటీ లేదా సీబీటీ + ఐబీటీ లేదా పీబీటీ + ఐబీటీ)కు అయితే రూ.2,975.

మొత్తం మార్కులు: 200

విభాగాలు: లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, ఇంటలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌, మ్యాథమేటికల్‌ స్కిల్స్‌, డేటా ఎనాలిసిస్‌ అండ్‌ సఫిషియెన్సీ, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌... ఇలా ఐదు సెక్షన్ల నుంచి 40 చొప్పున ప్రశ్నలడుగుతారు.

సమయం: మొత్తం రెండున్నర గంటలు (150 ని.లు).. సెక్షన్‌-1, 2- 30 నిమిషాల చొప్పున (60 ని.లు); సెక్షన్‌-3- 40 ని.లు; సెక్షన్‌-4- 35 ని.లు; సెక్షన్‌-5- 15 ని.లు.   

ముఖ్యమైన తేదీలు..
పీబీటీ-1, సీబీటీ-1: దరఖాస్తు చివరితేదీ: 2022, మే 9, అడ్మిట్ కార్డు: 2022, మే 11, పరీక్ష తేదీ: పీబీటీ- 2022, మే 15. 
పీబీటీ-2, సీబీటీ-2: దరఖాస్తు చివరితేదీ: 2022, మే 23, అడ్మిట్ కార్డు: 2022, మే 25, పరీక్ష తేదీ: పీబీటీ- 2022, మే 28. 
పరీక్ష ఫలితాలు: 2022, జూన్‌ రెండో వారంలో..

పరీక్ష కేంద్రాలు..

పీబీటీ-1: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం; పీబీటీ-2: హైదరాబాద్‌.

పీబీటీ-2: హైదరాబాద్‌, విశాఖపట్నం; సీబీటీ-2: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌:  https://mat.aima.in

ఏవైనా  సందేహాలుంటే..
matibt@aima.in (for IBT) 
matpbt@aima.in (for PBT)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని