IBPS Clerks: బ్యాంక్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు
IBPS Clerk jobs alert: దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియను పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు జులై 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దిల్లీ: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగించారు. దేశవ్యాప్తంగా పలు బ్యాంకుల్లో 4,545 క్లర్క్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చారు. వాస్తవంగా జులై 21 వరకు మాత్రమే దరఖాస్తుకు తొలుత అనుమతించారు. తాజాగా ఆ గడువును జులై 28 వరకు పొడిగించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 28లోపు https://www.ibps.in/ లింక్పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత 4045 క్లర్క్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన IBPS.. ఆ తర్వాత మరో 500 పోస్టులను పెంచుతూ మొత్తం 4545 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
UPSC: ఈపీఎఫ్వోలో 577 పోస్టులకు రాత పరీక్ష ఫలితాలు విడుదల
నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యాంశాలివే..
- అర్హత: ఏదైనా డిగ్రీ, కనీస కంప్యూటర్ పరిజ్ఞానం. వయో పరిమితి: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండోది 200 మార్కులకు మెయిన్స్. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.
- ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులివే..: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.
- పరీక్ష తేదీలు ఇంకా ఖరారు చేయలేదు. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరు మాసాల్లో నిర్వహించే అవకాశం ఉంది. మెయిన్స్ పరీక్షను అక్టోబర్లో నిర్వహిస్తారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలివే.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్; ఖమ్మం, వరంగల్. మెయిన్స్ పరీక్షను గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖ నగరాలతో పాటు హైదరాబాద్, కరీంనగర్లో నిర్వహించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్