Bank Jobs: బ్యాంకుల్లో 4వేలకు పైగా పోస్టులు.. డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు!
Bank jobs: డీగ్రీ అర్హతతో బ్యాంకులో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జులై 21వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..
ఇంటర్నెట్ డెస్క్: డిగ్రీ పూర్తి చేసి బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నవారికి గుడ్న్యూస్. వచ్చే ఏడాది(2024-25) నాటికి దేశ వ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా క్లర్కు పోస్టులను భర్తీ చేసేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్(సీఆర్పీ)-XIII నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా బ్యాంకుల్లో మొత్తం 4,045 క్లర్కు పోస్టుల్ని భర్తీ చేసేందుకు జులై 1 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జులై 21వరకు https://www.ibps.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యాంశాలివే..
- అర్హత: ఏదైనా డిగ్రీ, కనీస కంప్యూటర్ పరిజ్ఞానం. వయో పరిమితి: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండోది 200 మార్కులకు మెయిన్స్. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.
- ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులివే..: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.
- పరీక్ష తేదీలు ఇంకా ఖరారు చేయలేదు. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరు మాసాల్లో నిర్వహించే అవకాశం ఉంది. మెయిన్స్ పరీక్షను అక్టోబర్ నిర్వహిస్తారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలివే.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రామహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్; ఖమ్మం, వరంగల్. మెయిన్స్ పరీక్షను గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖ నగరాలతో పాటు హైదరాబాద్, కరీంనగర్లో నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్