JNVST 2024: ‘నవోదయ’లో ఆరో తరగతికి అప్లై చేశారా? దరఖాస్తుల గడువు పొడిగింపు

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును పొడిగించారు. 

Updated : 09 Aug 2023 16:47 IST

దిల్లీ: రాబోయే విద్యా సంవత్సరానికి (2024-25) జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఆగస్టు 10తో ముగియనున్న వేళ నవోదయ విద్యాలయ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో  ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 17వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఏర్పడింది.  

జవహర్‌ నవోదయ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది

దేశ వ్యాప్తంగా 649 జేఎన్‌వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష(JNVST 2024) నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా నవంబర్‌ 4(శనివారం)న ఉదయం 11.30గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో; 2024 జనవరి 20 (శనివారం) తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష(Jawahar Navodaya Vidyalaya selection test) నిర్వహించనున్నారు.  దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఏపీలో 15, తెలంగాణలో 9 చొప్పున ఉన్నాయి.

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని