TS EAMCET 2023: ఎంసెట్‌ కౌన్సెలింగ్ షురూ.. పూర్తి షెడ్యూల్‌ ఇదిగో..!

తెలంగాణ ఎంసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ షురూ అయింది. పూర్తి వివరాలివే..

Updated : 26 Jun 2023 18:07 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ 2023(TS EAMCET 2023) ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం మొదలైంది. ఎంసెట్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నేటి నుంచి జులై 5వరకు రుసుం చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది.  జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులైతే రూ.600ల చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఈ నెల 28నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అభ్యర్థులు 28 నుంచి జులై 8వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://tseamcet.nic.in/లో తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని